పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను ఆహ్వానించలేదు:వైట్ హౌజ్

భారత్ లో ప్రచారంలో ఉన్నవి తప్పుడు సమాచారం అన్న వైట్ హౌజ్;

Update: 2025-06-15 09:20 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ను అమెరికా మిలిటరీ పరేడ్ కు ఆహ్వనించినట్లు వస్తున్న వార్తలను వైట్ హౌజ్ ఖండించింది. పాకిస్తాన్ మిలీటరీ చీఫ్ కు ఆహ్వనం పలికినట్లు వస్తున్న వార్తలను తప్పుడు ప్రచారంగా పేర్కొంది. ఈ ఆహ్వానం వార్తలు బయటకు రాగానే కాంగ్రెస్, మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.

‘‘భారత మీడియా ప్రచారం చేస్తున్న వార్తలు పూర్తిగా తప్పు, ఏ విదేశీ నాయకులు, మిలిటరీ అధినేతలను మిలిటరీ పరేడ్ కు ఆహ్వనించలేదు’’ అని వైట్ హౌజ్ ప్రకటించింది.
అసిమ్ మునీర్ ను అమెరికా ఆహ్వనించిందనే వార్త నకిలీదని తెలియక చాలా పార్టీలు కేంద్రంపై విమర్శలు చేశాయి. ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) కూడా ట్రంప్ కు మోదీ గుడ్డి మద్దతుదారని విమర్శించింది. ఆసిమ్ మునీర్ కు వచ్చిన ఆహ్వానంపై మాత్రం అది ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదు.
పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో జర్థారీ నేతృత్వంలోని తన ప్రతినిధి బృందం అండర్ సెక్రటరీ హోదా కంటే ఎక్కువ స్థాయిలో ఉన్న యూఎస్ లోని ఏ అధికారితో అపాయింట్ మెంట్ దొరకలేదు.
బలప్రదర్శన..
జూన్ 14న అమెరికాలో అతిపెద్ద సైనిక ప్రదర్శన జరగింది. ఈ కవాతును వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనకారులు యూఎస్ వ్యాప్తంగా నిరసనలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ ను నియంత, కాబోయే మహారాజు అని పిలవడం గమనార్హం.
అమెరికా తన రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, అలాగే దేశ ప్రతిష్టను పెంచడానికి ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు. భారత్ గణతంత్య్ర దినోత్సవం, ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్ వంటి సంప్రదాయం అమెరికాకు లేదు. కాబట్టి దీనిని అమెరికన్లు అసాధారణమైన చర్యగా పిలుస్తున్నారు.
‘‘ప్రతి సంవత్సరం ఇతర దేశాలు వారి విజయాలను జరుపుకుంటున్నారు. అమెరికా కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది.’’ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
ఈ కవాతు జూన్ 14, 1775 న బ్రిటిష్ వలసవాదులతో పోరాడిన అమెరికా స్వాతంత్ర్య సంఘటనకు గుర్తుగా ప్రారంభించారు. ఇది తరువాత అధికారికంగా అమెరికా ఆవిర్భావానికి దారి తీసింది.
వాషింగ్టన్ లోని కాన్ స్టిట్యూషన్ అవెన్యూ గుండా ట్యాంకులు, పదాతి దళాలు ప్రయాణించాయి. అమెరికా సైనిక శక్తిని వీక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌజ్ కు దక్షిణంగా ఉన్న ప్రత్యేక స్టాండ్ పై కూర్చున్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సైనిక పోరాట బలాన్ని ప్రశంసించారు. ‘‘యూఎస్ సైనికులు పోరాడండి, పోరాడండి, పోరాడండి.. గెలుస్తారు.. గెలుస్తారు.. గెలుస్తారు’’ అని ట్రంప్ అన్నారు.
మొదటి గల్ఫ్ యుద్ధంలో ఇరాక్ ను ఓడించి కువైట్ ను విముక్తి చేయడానికి 1991 లో అమెరికా చివరిసారిగా తన సైనిక ప్రదర్శన నిర్వహించింది.
రాజులు లేరు..
ఈ కవాతుకు వ్యతిరేకంగా పలువురు నిరసన తెలిపారు. వీరు ట్రంప్ అనుసరించే పద్దతులను నిరంకుశ ధోరణిగా పిలుస్తున్నారు. నిరసనకారులంతా ‘ నో కింగ్స్ ’ బ్యానర్ కింద దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెల్స్ లో ప్రధానంగా పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అక్కడ వలసదాడులకు వ్యతిరేకంగా ట్రంప్ కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ ను స్వాధీనం చేసుకుని యూఎస్ మెరైన్ లను మోహరించేలా చేసింది. 
Tags:    

Similar News