అమెరికాకు పాక్ ప్రతినిధి బృందం, భారత దురాక్రమణ వివరిస్తారట!

వాషింగ్టన్ లో పర్యటిస్తున్న శశిథరూర్ బృందం;

Update: 2025-06-03 08:11 GMT
శశిథరూర్

పహల్గాంలో హిందూ పర్యాటకుల ఊచకోత, తదనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పరిణామాలను వివరించేందుకు న్యూఢిల్లీ నాయకత్వం ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతినిధులను పంపుతున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా అమెరికాలో శశిథరూర్ బృందం పర్యటిస్తోంది. ఇప్పుడు ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కూడా తన ప్రతినిధి బృందాన్ని కూడా వాషింగ్టన్ పంపబోతోంది. దీనికి బిలావల్ భుట్టో నేతృత్వం వహించబోతున్నారు. రెండు దేశాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇది చోటుచేసుకుంది.

ఉగ్రవాదంపై భారత్ వైఖరిని బలోపేతం చేయడానికి, పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు ఎలా సహాయం చేస్తుందో చూపించడానికి థరూర్ అమెరికాకు వెళ్లారు. ఆయన భారత పార్లమెంటరీ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. దీనితో పాకిస్తాన్ సైతం తన ప్రతినిధి బృందాన్ని అమెరికా పంపింది.
పాకిస్తాన్ పై దౌత్యపరమైన ఒత్తిడి
భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ తొమ్మిది మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ముగ్గురు మాజీ విదేశాంగ మంత్రులు హీనా రబ్బానీ, ఖుర్రం దస్తగిర్ ఖాన్, షెర్రీ రెహ్మన్, సమాఖ్యమంత్రి ముసాదిక్ మాలిక్, సెనేటర్ బుష్రా అంజుమ్ భట్, మాజీ విదేశాంగ కార్యదర్శులు జలీల్ అబ్బాస్ జిలానీ, తెహ్మీనా జంజువా అన్నారు.
ఈ బృందం న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బ్రసెల్స్ కు వెళ్లి అంతర్జాతీయ సెక్రటరీ జనరల్, యూఎన్జీఏ అధ్యక్షుడు, చైనా, రష్యా వంటి ముఖ్యమైన దేశాల రాయబారులను కలుస్తుంది.
పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ప్రకారం.. ఇటీవల భారత దాడిపై పాకిస్తాన్ దృక్పథాన్ని ప్రదర్శించడానికి, సంఘర్షణపై కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను చెప్పడానికి ఈ పర్యటనల లక్ష్యం. వీటికి తోడు ప్రతినిధి బృందం సింధు జలాల ఒప్పందం గురించి ఆందోళనలను వ్యక్తం చేసి, దాని పునరుద్దరణ కోసం ప్రపంచం ముందు తన వాదనలను వివరించనుంది.
పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటాలకు మద్దతు కూడగట్టడానికి 33 దేశాలకు ఏడు బృందాలను న్యూఢిల్లీ పంపిన తరువాత, పాకిస్తాన్ కూడా ఇదే విధానాన్ని కాపీ కొట్టింది.
రష్యాకు బృందం..
పాక్ ప్రధానమంత్రి ప్రత్యేక సహయకుడు సయ్యద్ తారిఖ్ ఫతేమీ నేతృత్వంలోని మరో పాకిస్తాన్ ప్రతినిధి బృందం జూన్ 2 నుంచి మాస్కోను సందర్శించింది. అయితే అక్కడికి ఎవరు వెళ్తారో ఇంకా ఆదేశం ప్రకటించలేదు.
ఈ రెండు ప్రతినిధుల బృందాలు అంతర్జాతీయ సంస్థల నాయకులు, ప్రభుత్వ అధికారులు, సీనియర్ అధికారులు, పార్లమెంటేరియన్లు, థింక్ ట్యాంకులు, మీడియా తో వరుస సమావేశాలు నిర్వహిస్తారని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
ఈ ప్రతినిధుల బృందం భారత్ చేసిన దురాక్రమణ విధానం ప్రపంచం ముందు పెడుతుందని అది పేర్కొంది. సంఘర్షణలు, ఘర్షణల కంటే చర్చలు, సంభాషణ, దౌత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పాకిస్తాన్ కోరుతున్నట్లు పేర్కొంది.
ర్యాలీ వివాదం..
పహల్గామ్ దాడిలో 26 మంది మరణించిన తరువాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మే 7న పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద మౌలిక స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది.
దీనితో ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణలు జరిగాయి. మే 8,9,10 తేదీలలో పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రతీకార దాడులకు ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది. దీనికి ప్రతిగా భారత్, పాక్ లోని 12 వైమానిక స్థావరాలు ధ్వంసం చేసింది. దీనితో పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదించింది.
అయితే ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ మొహ్మద్ అహ్మద్ ఖాన్ పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసిన వ్యక్తులను అమరవీరులని సంభోదించడం దుమారం రేగింది. జమ్మూకాశ్మీర్ లో భారత్ తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ దాడి జరిగిందని చెప్పారు. ఇది పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని భవిష్యత్ ను కష్టంతరం చేసే సంఘటనగా చెప్పవచ్చు.
Tags:    

Similar News