ఇరాన్ చమురు మార్కెట్ల పీక పిసుకుతుందా?
హార్ముజ జలసంధి ని ఇరాన్ మూసేస్తే ఏమవుతుంది?;
ప్రపంచ షిప్పింగ్ వాణిజ్యంలో కీలకపాత్ర వహించే హార్ముజ్ జలసంధి (Hormuz Strait) ని మూసేయకుండా నిరోధించాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చైనాను కోరారు.
ఇరాన్ పార్లమెంటు జలసంధిని మూసివేసే ప్రణాళికను ఆమోదించిందని ఇరాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రెస్ టీవీ ఇచ్చిన నివేదికల నేపథ్యంలో ఆమెరికా ఈ అప్పీల్ చేసింది.
అయితే అంతిమ నిర్ణయం ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి(Supreme National Security Council) పై ఆధారపడి ఉంటుంది.
హార్ముజ్ జలసంధిని మూసేస్తే చమురు రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రపంచ చమురు రవాణాలోఇరవై శాతం ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. ఇది పూర్తిగా ఇరాన్ అదుపులోనే ఉంటుంది. దీన్ని మూసేయడంటే అమెరికా మిత్రదేశాల గొంతుపిసకడమే. ఈ జలసంధి నుంచి ఒపెక్(Organization of Petroleum Exporting Countries: OPEC) రు చెందిన సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువాయత్, ఇరాక్ వంటి దేశాలు ఈ జలసంధినుంచే తమ దేశాల చమురును ప్రపంచానికి రవాణా చేస్తాయి. చైనాయే రోజూ 1.8 మిలియన్ బారెళ్ల చమురును ఈ దారి గుండా ఇరాన్ నుంచి తెప్పించుకుంటుంది.
ఈ జలసంధి పొడవు 167 కి.మీ. వెడల్పు 97 కిమీ నుంచి 39 కిమీ దాకా ఉంటుంది. ఈ జలసంధి ఉత్తర భాగం ఇరాన్ చేతిలో ఉంటుంది. దీనిని మూసేస్తే అయిల్ , గ్యాస్ ధరలు 30 నుంచి 50 శాతం పెరగుతాయి. ఇది ఆసియా మార్కెట్ ల మీదే కాదు, అమెరికా మీద కూడా ప్రభావం చూపుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే అమెరికాకు భయంపట్టుకుంది. అనేక పరిశ్రమలకు దెబ్బతగులుతుంది. అమెరికా చతికిలపడపోయినా కంగుతింటుంది.
పశ్చిమ దేశాలు ఇరాన్ మీద ఆంక్షలు పెంచుతున్నపుడు జలసంధిని మూసేస్తానని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది. ఇరాన్,-ఇజ్రేల్ ఉద్రికత్త మొదలయ్యాక కూడా ఇరాన్ ఈ హెచ్చరికలు చేసింది. ఈ జలసంధి నుంచి దాదాపు రోజూ 20 మిలియన్ బ్యారెళ్ల చ మురు సరఫరా అవుతుంది. అలాగే పెద్ద ఎత్తున గ్యాస్ కూడా రవాణా అవుతుంది.
ఇలాంటి జలసంధిని మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బ చేస్తుంది. ఇరాన్ చమురుకు ప్రపంచంలోనే అతి పెద్ద దిగుమతిదారుగా నిలిచి, టెహ్రాన్ తో బలమైన సంబంధాలను కొనసాగిస్తున్న చైనా కి కూడా ఇది వర్తిస్తుంది.
పెరిగిన ఉద్రిక్తతలు ఇప్పటికే ప్రపంచ చమురు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఇటీవల ఇరాన్ అణు కేంద్రాల పై అమెరికా దాడి చేసిన తర్వాత, అంతర్జాతీయ బెంచ్మార్క్ అయిన బ్రెంట్ ముడి చమురు ధర ఐదు నెలల గరిష్ట స్థాయికి పెరిగింది.
రెండు వైపులా దాడులు తీవ్రతరం
ఇరాన్ సోమవారం (జూన్ 23) ఇజ్రాయెల్ పై క్షిపణులు డ్రోన్లతో దాడి చేసింది, అదే సమయంలో అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై భారీ దాడుల నేపథ్యంలో అమెరికా లక్ష్యాలపై దాడి చేయడానికి తన సైన్యానికి "స్వేచ్ఛ" ఇవ్వబడిందని అమెరికాను హెచ్చరించింది.
ఇంతలో, ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ అధిపతి సోమవారం మాట్లాడుతూ, అధునాతన బంకర్-బస్టర్ బాంబులతో అమెరికా వైమానిక దాడి చేసిన తర్వాత ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ కేంద్రంలో "చాలా భారీ నష్టం" జరుగుతుందని భావిస్తున్నారు.
ఆదివారం ఇరానియన్ అణు కేంద్రాలపై దాడులతో, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలోకి ప్రవేశించింది, దీనితో విస్తృత ప్రాంతీయ సంఘర్షణ తలెత్తుతుందనే భయాలు వ్యక్తమయ్యాయి. క్షిపణులలతోపాటు 30,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులతో ఈ మూడు కేంద్రాలపై దాడి చేయడానికి అమెరికా తన ప్రమాదకర వ్యూహంతో లక్ష్మణరేఖని దేశంలోని ఉత్తర మరియు మధ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వచ్చిన ఇరాన్ ముప్పును
అడ్డుకోవడానికి తమ రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. ప్రజలను సురక్షిత ఆశ్రయాలకు వెళ్లమని చెప్పింది. ఇరాన్ ఈ దాడిని తన ఆపరేషన్ "ట్రూ ప్రామిస్ 3"లో కొత్త తరంగా అభివర్ణించింది, ఇజ్రాయెల్ నగరాలైన హైఫా, టెల్ అవీవ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది.
జెరూసలేంలో కూడా పేలుళ్లు వినిపించాయి. నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు.
ఇరాన్, ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాల పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మధ్యాహ్నం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు నివేదించారు. దేనిని లక్ష్యంగా చేసుకున్నారో వెంటనే స్పష్టంగా తెలియలేదు.