కాల్పుల విరమణ కోసం ఆ ఇద్దరిని సంప్రదించాం
‘పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేశాక అమెరికా, సౌదీ అరేబియా జోక్యాన్ని కోరాం’ - పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్;
పాకిస్థాన్(Pakistan)లోని రెండు వైమానిక స్థావరాలపై దాడుల అనంతరం కాల్పుల విరమణ కోసం భారత్(India)తో సంప్రదించినట్లు పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ స్వయంగా ఓ టీవీ షోలో వెల్లడించారు.
‘‘రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం, పంజాబ్ ప్రావిన్స్లోని షోర్కోట్ వైమానిక స్థావరంపై భారత వైమానిక దళాలు దాడులు చేశాయి. ఆ సమయంలో మేం అమెరికా సాయాన్ని కోరాం. అలాగే సౌదీ అరేబియాను కోరాం. మేం కాల్ చేసిన 45 నిముషాల తర్వాత సౌదీ అరేబియా యువరాజు ఫైసల్ నుంచి కూడా మాకు కాల్ వచ్చింది,’’ అని దార్ చెప్పారు.
జైశంకర్తో మాట్లాడిన ఫైసల్..
NDTV ప్రకారం.. ‘‘భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో మాట్లాడటానికి నాకు అధికారం ఉందా? అని ఫైసల్ నన్ను అడిగారు. అందుకు నేను ‘ఎస్’ అని చెప్పాను. ఆ తర్వాత ఫైసల్ నాకు తిరిగి ఫోన్ చేశారు. జైశంకర్కి కూడా చెప్పానని చెప్పాడు" అని ఫైసల్తో జరిగిన సంభాషణను దార్ బయటపెట్టారు.
అయితే కాల్పుల విరమణ(Cease fire) ఒప్పందంలో ఏ దేశ ప్రమేయం లేదని భారత్ చెబుతోంది. కాని ట్రంక్ మధ్యవర్తిత్వం వహించినందుకు పాకిస్తాన్ అమెరికాకు కృతజ్ఞతలు చెబుతోంది. తన జోక్యం వల్లే భారత్ - పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. దీన్ని భారత్ అంగీకరించడం లేదు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)తో మాట్లాడాక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ పేర్కొంది.