జమ్మూకశ్మీర్ మరోసారి ఉలిక్కిపడింది. ఉగ్రవాదుల తుపాకుల పేలుళ్లు మరోసారి అనంతనాగ్ జిల్లాను కమ్మేశాయి. అనంత్నాగ్ జిల్లా పహల్గంలో పర్యాటకులపై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు మరణించారు. ఇందులో మహిళలు కాకుండా పురుషుల టార్గెట్గా ఉగ్రవాదులు దాడులు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇదే సరైన సమయం అనుకున్న ఉగ్రవాదులు పర్యాటకులపై తమ ప్రతాపం చూపారు. అమాయకులను భయపెట్టి హతమార్చారు. ఈ అంశంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఉగ్రవాదులను గుర్తించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడినట్లు, కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రదాడి బాధితుల కుటుంబాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈరోజు పరామర్శించనున్నారు.
జమ్మూకశ్మీర్ మరోసారి ఉలిక్కిపడింది. ఉగ్రవాదుల తుపాకుల పేలుళ్లు మరోసారి అనంతనాగ్ జిల్లాను కమ్మేశాయి. అనంత్నాగ్ జిల్లా పహల్గంలో పర్యాటకులపై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు మరణించారు. ఇందులో మహిళలు కాకుండా పురుషుల టార్గెట్గా ఉగ్రవాదులు దాడులు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇదే సరైన సమయం అనుకున్న ఉగ్రవాదులు పర్యాటకులపై తమ ప్రతాపం చూపారు. అమాయకులను భయపెట్టి హతమార్చారు. ఈ అంశంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఉగ్రవాదులను గుర్తించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడినట్లు, కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రదాడి బాధితుల కుటుంబాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈరోజు పరామర్శించనున్నారు.