వైరల్ అయిన రామ్‌లల్లా ఫొటోలపై దర్యాప్తు చేయమంటున్నదెవరు? ఎందుకు?

అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఆలయ ప్రధాన పూజారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కోపానికి కారణం ఏమిటి?

Update: 2024-01-21 11:50 GMT

మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కిన 51 అంగులాల ఎత్తు ఉన్న రామ్‌లల్లా విగ్రహాన్ని ఇటీవల ఆలయానికి తీసుకొచ్చారు. తర్వాత విగ్రహం కళ్లను పసుపు గుడ్డతో కప్పి ఉంచి, గులాబీ దండతో అలంకరించారు. ఈ ఫొటోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అయితే శుక్రవారం సోషల్‌ మీడియాలో కనిపించిన ఫొటోలపై ఆలయ ప్రధాని పూజారి సత్యేంద్ర దాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘ప్రాణ ప్రతిష్ఠ’ జరిగే వరకు విగ్రహం కళ్లను పసుపు వస్త్రంతో కప్పి ఉంచుతాం. ఆ తర్వాతే ఆ వస్త్రాన్ని తొలగిస్తాం. ఈ లోపు కళ్లకు ఆచ్చాదన లేసి ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. అసలు విగ్రహం ఫొటోలు బయటకు ఎలా వెళ్లాయో విచారణ జరపాలి’’ అని డిమాండ్‌ చేశారు.

కాగా సోమవారం (జనవరి 22) మధ్యాహ్నం 12:20 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ తెలిపారు.  

Tags:    

Similar News