ఎర్రకోట పేలుడుకు ఫరీదాబాద్ లింక్ పై దర్యాప్తు
ఫరీదాబాద్ పేలుడు పదార్థాల స్వాదనం తర్వాత కొన్ని గంటల్లోలనే ఎర్రకోట్ పేలుడు జరిగింది.
సోమవారం నాడు ఫరీదాబాద్ లోని ఒకడాక్టర్ ఇంట్లోస్వాదీనం చేసుకున్న పేలుడురసాయనాలకు, ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు సంబంధం ఉందాఅనే దాని మీద పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎందుకంటే స్వాదీనం తర్వాత కొన్ని గంటల్లోనే ‘ఎర్రకోట’ పేలుడుజరిగింది.
ఫరీదాబాద్ లింక్ ?
ఢిల్లీ సరిహద్దులోని ఫరీదాబాద్లో ఒక కాశ్మీరీ వైద్యుడు అద్దెకు తీసుకున్న వసతి గృహం నుండి దాదాపు 360 కిలోల అనుమానిత అమ్మోనియం నైట్రేట్ ,ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల లోపే ఢిల్లీలో పేలుడు సంభవించింది.
హర్యానా పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి, ఫరీదాబాద్ లోని ధౌజ్ ప్రాంతం నుండి డాక్టర్ ముజమ్మిల్ గనైని అరెస్టు చేశారు.
పేలుడులో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించబడిందా అని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తనిఖీ చేస్తోందని, ఇది ఫరీదాబాద్ మాడ్యూల్ తో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి.
9 కి చేరిన మృతుల సంఖ్య
సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారులో భయంకర పేలుడు సంభవించింది. ఇందులో కనీసం తొమ్మిది మంది మృతి చెందారు. అనేక వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
ఆర్డీఎక్స్ వాసనలేదు
ఇంకా, సంఘటనా స్థలంలో ఎలాంటి RDX వాసన కనిపించలేదు. అయినా సరే అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. బాంబు బృందం పేలుడు జరిగిన ప్రదేశంలో డిటోనేటర్లు, ఏదైనా బాంబు తయారీ పదార్థం ఉందా అని కూడా తనిఖీ చేస్తుందని వారు తెలిపారు.
పేలుడు స్థలాన్ని సందర్శించి, LNJP ఆసుపత్రిలో బాధితులను కలిసిన అమిత్ షా, పరిస్థితిని సమీక్షించడానికి ఢిల్లీ పోలీసు చీఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ మాట్లాడారు.
LNJP హాస్పిటల్ పంచుకున్న జాబితా ప్రకారం, ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరియు 18 మంది పురుషులు సహా మొత్తం 20 మంది గాయపడ్డారు. వారిలో 12 మంది ఢిల్లీ నివాసితులు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు చెందినవారు. గాయపడిన అతి పిన్న వయస్కుడిని ఢిల్లీలోని ఉస్మాన్ పూర్ కు చెందిన 21 ఏళ్ల శివం ఝాగా గుర్తించారు.
పేలుడు తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పరిస్థితిని సమీక్షించి, మృతులకు సంతాపం తెలిపారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.
పేలుడు సంభవించడానికి ముందు వాహనం ప్రయాణించిన మార్గాన్ని గుర్తించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను స్కాన్ చేస్తున్నారు. వారు స్థానికులను ప్రశ్నిస్తున్నారు మరియు సంఘటనకు ముందు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం పంచుకోవాలని ప్రత్యక్ష సాక్షులను అడుగుతున్నారు. మొబైల్ డంప్ డేటాను సేకరిస్తున్నారుజః. అనుమానిత ఉగ్రవాదుల పత్రాలను స్కాన్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరు కార్లు, రెండు ఈ-రిక్షాలు, ఒక ఆటోరిక్షా దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు.