ఆపరేషన్ సిందూర్ శత్రువుకు కొత్త పాఠం నేర్పింది: సీడీఎస్
భవిష్యత్ యుద్ధాలను అంచనా వేయలేము, కేవలం ధోరణులు మాత్రమే ఉంటాయన్న అనిల్ చౌహన్;
By : The Federal
Update: 2025-06-01 08:45 GMT
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి రెడ్ లైన్ వంటిదని, న్యూఢిల్లీ తీసుకున్న కొత్త విధానం శత్రువుకి కొన్ని కొత్త పాఠాలు నేర్పిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ అనిల్ చౌహన్ చెప్పారు. భారత్ సహనానికి ఒక పరిమితి ఉందనే సందేశాన్ని అందిస్తుందని అన్నారు.
సింగపూర్ లో షాంగ్రి- లా డైలాగ్ కింద జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల ఆపరేషన్ సిందూర్, భారత్ - పాకిస్తాన్ సంబంధాలలో వ్యూహాత్మక స్థిరత్వం పై పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సీడీఎస్ మాట్లాడుతూ.. చప్పట్లు కొట్టడానికి రెండు జతలు కలపాలని, వారు దీనిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్..
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది హిందువులు మృతి చెందడానికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ధ్వంసం చేయడానికి మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది.
పాకిస్తాన్ దాడులకు తదనంతరం జరిగిన ప్రతీకార చర్యలన్నీ ఈ ఆపరేషన్ కిందనే జరిగాయి. భారత్- పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక వివాదం చివరకు అణ్వాయుధ ఘర్షణకు దారి తీస్తుందని ప్రపంచం భయపడింది.
300 కిలోమీటర్లు చొచ్చుకుపోయింది..
ఆ సంఘర్షణ నుంచి నేర్చుకున్న పాఠం గురించి అడిగిన ప్రశ్నకు జనరల్ చౌహన్ స్పందించారు. భారత్ ఆపరేషన్ సమయంలో ఇతర దేశాల నుంచి తీసుకువచ్చిన వాటితో పాటు స్వదేశీ వ్యవస్థలను సైతం ఉపయోగించిందని అన్నారు.
‘‘పాకిస్తాన్ లోపలి భాగంలో కచ్చితమైన లక్ష్యాలు, వైమానిక స్థావరాలు, మౌలిక సదుపాయాలతో మేము 300 కిలోమీటర్ల వరకూ శత్రువు వాయు రక్షణలోకి చొచ్చుకుపోగలిగాము. అది పరికరాల సన్నద్దత, కార్యాచరణను సూచిస్తుంది’’ అని ఆయన అన్నారు.
ఆసియాలో కీలకమైన శిఖరాగ్ర సమావేశం అయిన షాంగ్రీలా డైలాగ్ లో భాగంగా జరిగిన భవిష్యత్ సవాళ్లకు రక్షణ ఆవిష్కరణ పరిష్కారాలు అనే సెమినార్ లో జనరల్ చౌహన్, అనేక మంది రక్షణ అధిపతులు, వివిధ దేశాల ప్రతినిధులు ప్రసంగించారు.
‘‘ప్రపంచంలో అస్థిరత పెరుగుతోంది. ఇదంతా ఉగ్రవాదులు ఇతర అసాంఘిక కార్యకలాపాల వల్లే జరుగుతోంది. వారు సంఘర్షణకు దారితీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు’’ అని జనరల్ చౌహన్ తన ప్రసంగంలో అన్నారు.
ఆధునాతన యుద్ధం..
‘‘యుద్ధం, సమాచారం, సైబర్, విద్యుదయస్కాంత స్పెక్ట్రం, అభిజ్ఞా డొమైన్ కొత్త డొమైన్ ఆవిర్భావం సంఘర్షణ స్థాయిలను పెంచుతోంది.’’ అని ఆయన అన్నారు. భవిష్యత్ లో మనుగడ సాగించాలంటే సైనిక సంస్థలు ఆవిష్కరణల చాతుర్యాన్ని పెంచుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
‘‘బాధ్యతాయుతమైన ప్రవర్తన, ప్రత్యేకమైన భౌగోళిక స్థానం, చారిత్రక అనుభవం, అభివృద్ది ఆకాంక్షల ద్వారా భద్రతా సవాళ్లను మా విధానం ద్వారా ప్రపంచశాంతి, భద్రతకు దోహదపడటానికి భారత్ కట్టుబడి ఉంది’’ అని సీడీఎస్ అన్నారు. తరువాత సెమినార్ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ ప్రశ్నలపై సమాధానం ఇచ్చారు.
రెడ్ లైన్
‘‘ భారత్ రాజకీయంగా ప్రత్యేకంగా ఓ పనిచేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొత్త రెడ్ లైన్ చేశారు. ఇది మన ప్రత్యర్థికి కూడా కొత్త పాఠం నేర్పుతుందని నేను ఆశిస్తున్నాను. భారత సహనానికి కూడా పరిమితి ఉందని వారు నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాను’’ అని జనరల్ చౌహన్ అన్నారు.
‘‘మనం దాదాపు రెండు దశాబ్ధాలుగా ఈ పరోక్ష ఉగ్రవాద యుద్దానికి గురువుతున్నాము. చాలామందిని కోల్పోయాము. దీనిని అంతం చేయాలనుకుంటున్నాము’’ అని ఆయన అన్నారు.
ఆపరేషన్ తరువాత వ్యూహాత్మక స్థిరత్వం ఉందని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘వ్యూహాత్మక స్థిరత్వం తీసుకురావడానికి రెండు చేతులు కలవాల్సిన అవసరం ఉందని వారు దీనిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము, మనం విషయం పరిశీలించవచ్చు’’ అన్నారు.
ఇంటిగ్రేటర్ థియేటర్ ఆదేశాలు..
ప్రణాళికబద్దమైన ఇంటిగ్రేటేడ్ థియేటర్ కమాండ్ పై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘దీనికి నిర్ణీత కాలక్రమం ఇవ్వలేము’’ అన్నారు. ఈ ప్రయత్నంలో మేము కొంతమేర విజయం సాధించాము. అందులో కొంత భాగం ఇటీవల ముగిసిన ఆపరేషన్ సమయంలో ప్రదర్శించాము.
ఈ ఆపరేషన్ కోసం ఉమ్మడి ప్రణాళిక, ఉమ్మడి నిఘా, లక్ష్యాలపై కలిసికట్టుగా దాడి, లాజిస్టిక్స్ వంటి సాధించామని చెప్పారు. దాడి తరువాత ఇది ఎలా జరిగిందో కూడా పరిశీలిస్తామని, దేశానికి అవసరమైన కేంద్రీకృతమైన దానిని సృష్టిస్తామని సీడీఎస్ అన్నారు.
యుద్ధంలో సాంకేతికత
ఆధునిక యుద్ద స్వభావం, దాన్ని మార్చే అంశాల గురించి మాట్లాడారు. ‘‘ నిజం చెప్పాలంటే భవిష్యత్ ను అంచనా వేయడం ప్రమాదకరం. మనం చేయగలిగేది ధోరణుల గురించి మాట్లాడటమే. మనం ఎదుర్కొనే భవిష్యత్ సవాళ్లు ఉద్భవిస్తున్న భౌగోళిక రాజకీయ గతిశీలత, సంక్లిష్టత, అపూర్వమైన సాంకేతిక పరిజ్ఞానం నుంచి ఉత్పన్నమవుతున్నాయని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన అన్నారు.
‘‘నేడు మానవ రహిత వ్యవస్థలు, ఆర్థిక, మానవ వ్యయాన్ని తగ్గిస్తోంది. ఇది బలప్రయోగం పట్ల తీరును మార్చుతోంది’’ అని సీడీఎస్ అన్నారు. చాలా దేశాలు అధికారిక యుద్ద ప్రకటన లేకుండా జరుగుతోందని చెప్పారు.
‘‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ప్రజాస్వామ్యీకరణ ఫలితంగా ఆయుధ వ్యవస్థల విస్తరణ, లోతైన అనుసంధానం, నెటిజన్లు, పౌరులు సహ రాష్ట్రేతర సంస్థల శక్తిని, ఆలోచనలు, అవగాహనాలను, అందువల్ల పర్యావరణాన్ని రూపొందించే సామర్థ్యాన్ని పెంచుతోంది’’ అని ఆయన అన్నారు.
యంత్రాల మధ్య పోరాటం..
నేడు నాన్ లీనియర్ ఏకకాల కార్యకలాపాలు యుద్ధం ప్రధాన సూత్రాలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఆయుధ వ్యవస్థలు సబ్ సోనిక్ నుంచి సూపర్ సోనిక్, లాంగ్ రేంజ్ ప్రెసిషన్ ఆయుధాలకు మారడం, స్టెల్త్ టెక్నాలజీల పరిపక్వత, ఫ్రాక్షనల్ ఆర్భిటల్ బాంబర్డ్ మెంట్ సిస్టమ్ లు, స్వార్మ్ టెక్నాలజీలతో కూడిన డ్రోన్ లు వేగానికి కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి.
ఎక్కడైనా, ఎప్పుడైనా లక్ష్యాలను చేరుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు. మానవ రహిత స్వయం ప్రతిపత్తితో వ్యవస్థతో పాటు మానవ రహిత జట్టు అనే భావన, రోబోటిక్స్ లో పురోగతి త్వరలో మనిషి, యంత్రాల మధ్య లేదా యంత్రాలు- యంత్రాల మధ్య పోరాటం అనే కొత్త భావన తీసుకొస్తుందని సీడీఎస్ అన్నారు.
క్వాంటం టెక్నాలజీలు సురక్షితమైన కమ్యూనికేషన్ లను సాధ్యం చేస్తున్నాయని, కంప్యూటింగ్ ను అభివృద్ది చేస్తున్నాయని, ఇది యుద్ధ సంక్లిష్టతకు తోడ్పడుతుందని, అందువల్ల దానికి సిద్దం కావడానికి సవాళ్లు పెరుగుతాయని ఆయన అన్నారు.
‘‘నిన్నటి వ్యవస్థలతో కాకుండా రేపటి సాంకేతికతో నేటి యుద్దాన్ని ఎదుర్కోగలిగేలా సేకరణ విధానాలను సరళీకృతం చేస్తున్నాము’’ అని సీడీఎస్ అన్నారు.