సైనిక ఘర్షణలో యుద్ధ విమానాలు కోల్పోయాం: చౌహన్

ఘర్షణలో జెట్ కూలిపోవడం ముఖ్యంకాదు, ఎందుకు కూలిందన్నదే ముఖ్యమన్న సీడీఎస్;

Update: 2025-05-31 14:11 GMT
సీడీఎస్ అనిల్ చౌహాన్

ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ తో జరిగిన సాయుధ ఘర్షణల్లో భారత సైన్యం తొలిసారిగా తనకు జరిగిన నష్టాలను వివరించింది. కొన్ని ఫైటర్ జెట్లు కోల్పోయినట్లు అంగీకరించింది. అయితే యుద్ధంలో ఎన్ని యుద్ద విమానాలు కూలిపోయాయో వాటి సంఖ్య మాత్రం వెల్లడించలేదు. భారత సాయుధ దళాల చీఫ్ డిఫెన్స్ స్టాప్(సీడీఎస్) అనిల్ చౌహన్ శనివారం బ్లూమ్ బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. 

సంఖ్య చెప్పని సీడీఎస్..
చౌహన్ వైమానిక దళం యుద్ద విమానాలను కోల్పోయిందని నేరుగా అంగీకరించలేదు. అలాగని ఖండించను లేదు. ‘‘ముఖ్యమైన యుద్ధ విమానాన్ని కూల్చివేయడం కాదు. ఎందుకు కూలిపోయింది అనేది ముఖ్యం’’ అని సీడీఎస్ చెప్పారు.
మంచి భాగం ఏంటంటే.. ఇంతకుముందు ఉన్న వ్యూహాత్మక తప్పిదాలను సరిదిద్దారు. రెండు రోజుల తరువాత అన్ని భారతీయ జెట్ లు మళ్లీ సుదూర లక్ష్యాలను సులువుగా చేధించాయని చెప్పారు.
తప్పులను సరిదిద్దారు..
‘‘జెట్ లను కూల్చివేయడం ముఖ్యం కాదు. వాటిని ఎందుకు కూల్చివేశారన్నది ముఖ్యమని నేను భావిస్తున్నాను. ముఖ్య విషయమేమిటంటే మేము చేసిన వ్యూహాత్మక తప్పిదాన్ని అర్థం చేసుకోగలిగాము. దాని సరిదిద్దుకున్నాము. రెండు రోజుల తరువాత దాన్ని మళ్లీ అమలు చేస్తాము. మా జెట్ లన్నింటిని మళ్లీ లాంగ్ రేంజ్ లక్ష్యాలపై దాడులు చేసుకుని ఎగురవేశాము’’ అని షాంగ్రీ- లా డైలాగ్ సందర్భంగా సీడీఎస్ బ్లూమ్ బెర్గ్ టీవీకి చెప్పారు.
పాక్ వాదనను తోసిపుచ్చిన సీడీఎస్..
ఆరు భారత జెట్ లు కూలిపోయాయనే పాకిస్తాన్ చేసిన వాదనలను ఆయన ఖండించారు. ఇది పూర్తిగా తప్పని చెప్పారు. జెట్ లు ఎందుకు కూలిపోయాయో ముఖ్యమని ఆయన చెప్పారు.
‘‘ పాక్ వాదన కచ్చితంగా తప్పు. నేను ముఖ్యమైనదని చెప్పిన సమాచారం అది కాదు. వారు ఎందుకు పడిపోయారన్నది ముఖ్యం. అది మాకు చాలా ముఖ్యం. ఆ తరువాత మేమేం చేశామో అది ముఖ్యం’’ అని చౌహన్ అన్నారు.
ట్రంప్ మాటలు అబద్దం..
రెండు దేశాల మధ్య అణ్వాయుధ యుద్ధం జరగకుండా తాను అడుకున్నాన్న ట్రంప్ మాటలను కూడా సీడీఎస్ ఖండించారు. రెండు దేశాలు కూడా అణ్వాయుధాలను ఉపయోగించలేరని ఆయన అభిప్రాయపడ్డారు.
సాంప్రదాయ యుద్ధానికి, అణు యుద్ధానికి మధ్య స్పష్టమైన తేడా ఉంటుందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని చెప్పారు. పరిస్థితిని అదుపులో పెట్టడానికి పాకిస్తాన్ తో కమ్యూనికేషన్ మార్గాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఆయన అన్నారు.
పాకిస్తాన్ వాదనకు విరుద్దంగా చైనా, ఇతర దేశాల నుంచి సరఫరా చేసిన ఆయుధాలు పనిచేయలేదని చెప్పారు. పాకిస్థాన్ లోపల 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారీ సైనిక కారాగారాలపై భారత సైన్యం కచ్చితమైన దాడులు చేసి అనేక లక్ష్యాలను ధ్వంసం చేసిందని అన్నారు. కాల్పుల విరమణ కొనసాగుతోందని, దాని భవితవ్యం చర్యలపై ఆధారపడి ఉంటుందని కూడా ఆయన అన్నారు.
మే 7 న ప్రారంభమైన సాయుధ ఘర్షణలో భారత యుద్ధ విమానాల గురించి  ప్రభుత్వం, సైన్యం నుంచి వచ్చిన తొలి ప్రత్యక్ష వ్యాఖ్యలు ఇవే. 
Tags:    

Similar News