రండి, రండి అయోధ్య తీసుకెళ్తాం! బీజేపీ రాజకీయ అస్త్రం అయోధ్య!!

బీజేపీ అయోధ్యను రాజకీయ అస్త్రంగా వాడుకుంటుందా? ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 200 మందిని అయోధ్యకు తరలించడం వెనక అసలు ప్రయోజనం ఓట్లే తప్ప భక్తి కాదని ఎవరన్నారు.

Update: 2024-01-23 06:40 GMT

అయోధ్య రామాలయాన్ని ఇప్పుడు ప్రారంభించడం వెనకున్న అసలు ప్లాన్ బయటకు వచ్చింది. ఓట్ల కోసమే ఇంత హడావిడి చేశారని కాంగ్రెస్‌ సహా అన్ని రాజకీయ పార్టీలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. 'ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 200 మందిని అయోధ్యకు తరలించడం వెనుకున్న అసలు ప్రయోజనం ఓట్లే తప్ప భక్తి కాదని' సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టిసారించింది. గతంలో కన్నా ఎక్కువ లోక్ సభ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది.

బీజేపీ రాజకీయ అస్త్రంగా అయోధ్య...

అయోధ్య రాముడిని అస్త్రంగా మార్చుకోబోతుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు నడిచే రైళ్లలో భక్తుల తరలించనుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు నడిచే రైళ్లలో భక్తులను తరలించనుంది. దీనికి సంబంధించి బాధ్యులను కూడా నియమించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు రైల్వేశాఖ వెయ్యి రైళ్లను నడుపుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి నడిచే రైళ్లలో భక్తులను తరలించనుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అయోధ్యకు భక్తులను తీసుకెళతారు.

29 నుంచి భక్తుల్ని తీసుకువెళ్లే కార్యక్రమం...

ఈ నెల 29వ తేదీ నుంచి భక్తులను తీసుకెళ్లే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. పార్లమెంట్ పరిధిలో 6 లేదా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందిని తీసుకెళతారు. పార్లమెంట్ స్థానం నుంచి 1400 మంది వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది.



ముందు చాన్స్‌ ఎవరికంటే...

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక రైళ్లను బుక్‌ చేసింది. రైలుకు 20 బోగీలు ఉంటాయి. బోగికి ఒక బీజేపీ ఇంచార్జీ ఉంటారు. వారికి కావాల్సిన ఏర్పాట్లను చూస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే రైలులో సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి జనాలను తీసుకెళతారు. కాజీపేట నుంచి వెళ్లే రైలులో నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ నియోజకవర్గాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి అయోధ్య వెళ్లడానికి 30 గంటల సమయం పడుతుంది. అక్కడ దర్శనం చేసుకుని, ఐదు రోజుల్లో తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటారు.

ఈ ప్లాన్‌ ఫలితాలను ఇస్తుందా?

అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందిని ఎంపిక చేసుకుని తీసుకెళతారు. వారి ఖర్చులన్నీ బీజేపీ నేతలు భరిస్తారని తెలిసింది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అయోధ్య పర్యటన తమకు కలిసి వస్తోందని కమలం పార్టీ ఆలోచిస్తోంది. ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి అయోధ్య టూర్‌ని అస్త్రంగా మార్చుకుంటుంది. ఆశించిన ఫలితం వస్తోందో లేదో చూడాలి మరి.

Tags:    

Similar News