రిహన్న పాటకి అంబానీ ఎన్ని కోట్లు ఇస్తారో తెలిస్తే మీరు షాకే?

ఈ సింగర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో చెబితే- మీరు గిరగిరా తిరిగి భూమ్మీద పడాల్సిందే. అదంతే మరి..

Update: 2024-03-01 15:13 GMT
రెహన్నా (ఫోటో కర్టసీ వికీపీడియా)

మాట వరసకే అడుగుతున్నా.. ఓ సింగర్ ఓ పాట కచేరికి ఎంత తీసుకుంటారు? పర్ సపోజ్.. లక్ష, రెండు, ఐదు.. పది లక్షలు.. ఇంకా బాగా చెప్పాలంటే మహా అయితే ఓ కోటి రూపాయలే అనుకుందాం. మరీ విడ్డూరం అనుకోకపోతే- ఈ సింగర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో చెబితే- మీరు గిరగిరా తిరిగి భూమ్మీద పడాల్సిందే. అదంతే మరి!


ప్రపంచ కుభేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ పార్టీ గుజరాత్ జామ్ నగర్ లో ఝంజామారుతంగా సాగుతోంది. ఇందులో ఓ షో చేయడానికి అంతర్జాతీయ సింగర్ రిహానా వచ్చారు. ఆమెకు ఎంత చెల్లిస్తున్నారో తెలుసా? ఆ డబ్బెంతో తెలిస్తే మీకు కరెంట్ షాక్ అవసరం లేదు.

ఇంతకీ ఆ గాయని ఎవరు?

పేరు రాబిన్ రిహన్న ఫెంటీ. అమెరికన్ గాయని. నిండా 40 ఏళ్లు కూడా లేవు. బార్బాడియన్ గాయని. వ్యాపారవేత్త. నటి. 21వ శతాబ్దపు ప్రముఖ రికార్డింగ్ కళాకారుల్లో మేటి. అమెరికన్ నల్లజాతీయులు ఉద్యమం నడుపుతున్నప్పుడు ఐయామ్ విత్ యూ అనే ఆల్బమ్ ఓ సెన్సేషన్. కరేబియన్ సంగీతమంటే మక్కువ. ఆ మధ్య ఓసారి అమెరికన్ అధ్యక్షుడు బైడెన్ తో కలిసి ఓ ఫంక్షన్ లో కూడా పాల్గొన్నారు. ఆమె ఆటా పాటాకు సంగీత చిత్ర పరిశ్రమలో తిరుగులేదు. గ్రామీ అవార్డు గ్రహీత కూడా. అంతటి పేరుండబట్టే ఆమె గ్లోబల్ స్టార్‌డమ్‌లోకి వచ్చారు. రిహన్నా 2015లో ‘బెటర్ హావ్ మై మనీ’ అని పాడినప్పుడు యావత్ ప్రపంచమే ఊగిపోయింది. ఇప్పుడామె ఇండియాలో ఉన్నారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే గుజరాత్‌లోని జామ్‌నగర్ - అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఉన్నారు. రిహన్న గర్భవతిగా ఉన్నప్పుడు 2023 సూపర్ బౌల్‌లో చివరి ప్రదర్శన చేశారు. తిరిగి ఇప్పుడే మళ్లీ షో ఇవ్వబోతున్నారు.

ఇక ఆమె తీసుకునే డబ్బెంతంటే..

ఇంతవరకు ఓకే. మనల్ని బొల్లిగింతలు పెట్టించేదేమిటంటే ఆమె తన షో కి తీసుకునే డబ్బు. డెయిలీ మెయిల్ అనే పత్రిక కథనం ప్రకారం ఈ ఈవెంట్‌లో ప్రదర్శనకు భారీ మొత్తంలో చెల్లింపు జరుగుతోంది. వివాహ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి రిహానాకు £5 మిలియన్లు. అంటే మన డబ్బులో చెప్పాలంటే 52 కోట్ల రూపాయలు. ఆమె ట్రూప్ కి, వేదికకు, ప్రత్యేక విమానాలకు ఏదైతేనేం 77 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా అంటూ ఇంగ్లీషు మీడియా కోడై కూస్తోంది.

రిహన్న తన భాగస్వామి రాకీతో కలిసి జామ్‌నగర్‌కు చేరుకున్నారు. అయితే ఆమె కన్నా ముందు ఆమె 'సామాను' జామ్ నగర్ చేరింది. 2018లో జరిగిన అంబానీ కుమార్తె ఇషా పెళ్లిలో బెయోన్స్ ప్రదర్శన ఇప్పించారు. ఇప్పుడు ఏకంగా రిహెన్నాను పిలిపించారు.

తణుకుబెణుకుల సినీహీరో లెందరో...

ముకేశ్ అంబానీ అతిథుల లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే...షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, రాణి ముఖర్జీ, సల్మాన్ ఖాన్, అర్జున్ కపూర్, అట్లీ, అయాన్ ముఖర్జీ, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అమీర్ ఖాన్, అక్షయ్ ఖన్నా ఉన్నారు. కాజోల్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వంటివారున్నారు.

అనంత్ ప్రీ వెడ్డింగ్ బాష్‌ (మహావిందు)కి హాజరయ్యే ఇతర ముఖ్యుల్లో బిల్ గేట్స్, ఇండియన్ బిలియనీర్లు గౌతమ్ అదానీ, కుమార్ మంగళం బిర్లా, పలువురు క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఉన్నారు.

51వేల మందికి అన్న సేవ

వివాహానికి ముందు జామ్‌నగర్‌లో 'అన్న సేవ' జరిగింది. సుమారు 51 వేల మంది స్థానిక నివాసితులకు భోజనాలు పెట్టారు. ఈ అన్నసేవ కొన్ని రోజుల పాటు కొనసాగనుంది. శుక్రవారం సాయంత్రం 'యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్‌ల్యాండ్' పేరుతో ఈవెంట్‌తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Tags:    

Similar News