రెండు దశాబ్దాల తర్వాత ఓటర్ల జాబితా సవరణ..

నాలుగు రాష్ట్రాల్లో 5 నియోజకవర్గాలకు ఉపఎన్నికలు;

Update: 2025-06-01 12:06 GMT
Click the Play button to listen to article

ఓటరు జాబితా పక్కాగా ఉండేలా ఎలక్షన్ కమిషన్ (Election commission) చర్యలు తీసుకుంటుంది. ఇలా ఓటరు జాబితాను సవరించడం 2006లో తమిళనాడులో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతోంది.

1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతి ఎన్నిక, ఉప ఎన్నికకు ముందు ఓటర్ల జాబితాను సవరించాల్సి ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే అవసరాన్ని బట్టి సవరించాలా? వద్దా? అనే విషయాన్ని కమిషన్ నిర్ణయిస్తుందని చెబుతున్నారు.

నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు(Byelections) జూన్ 19న జరగనున్నాయి. గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో ఒక్కో నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 23న జరుగుతుంది.

గుజరాత్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే కర్సన్‌భాయ్ పంజాభాయ్ సోలంకి మరణంతో కాడి స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అలాగే విశావదర్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్ గండుభాయ్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరగనుంది. కేరళలో పీవీ అన్వర్ రాజీనామా చేసిన నీలంబర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి మరణంతో పంజాబ్‌లోని లూథియానా స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లోని కాలిగంజ్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు నసీరుద్దీన్ అహ్మద్ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

నియోజకవర్గంలో లేనివారిని తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారి ఓటర్లను తొలగించడం చేస్తారు. 

Tags:    

Similar News