ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట మృతులకు రైల్వేశాఖ పరిహరం
ఒకే ఫ్లాట్ ఫాం పైకి వందలాది మంది ప్రయాణీకులు రావడంతో తొక్కిసలాట;
నిన్న రాత్రి న్యూఢిల్లీ ర్వైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది మరణించారు. వారిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలు ఉన్నారు. దాదాపుగా డజన్ మందికి పైగా గాయపడ్డారు.
చనిపోయిన వారికి రైల్వేశాఖ రూ. 10 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. గాయాలపాలైన వారికి లక్ష రూపాయల నష్టపరిహారం అందజేస్తామని కూడా వెల్లడించింది.
ఈ తొక్కిసలాట ముందు మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ కు రైళ్లు ఎక్కడానికి వేచి ఉన్న ప్రయాణికుల రద్దీ 14-15 ఫ్టాట్ ఫాంలపై విపరీతంగా పెరిగిపోయింది.
తాత్కాలిక ముఖ్యమంత్రి అతిశీ విలేకరులతో మాట్లాడుతూ... సెంట్రల్ ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ ఆసుపత్రికి 15 మంది మృతదేహాలు వచ్చాయని, మరో 15 మంది గాయపడ్డారని వారికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు.
కొద్ది సేపటికి గాయపడిన వారిలో మరో ముగ్గురు చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 18 కి పెరిగింది. వారిలో ఐదుగురు పిల్లలు ఉండటం అందరిని కలిచివేస్తోంది.