పోసానిపై మరో కేసు

తెరపైకి మరో కేసు వచ్చింది. చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసు స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు.;

Update: 2025-03-03 16:18 GMT

ప్రముఖ సినీ నటుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పోసాని కృష్ణమురళి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నరసరావుపేట కోర్టు పోసానికి 10 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య దూషణలు చేశారనే అభియోగాలతో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 24న మణి అనే జనసేన నాయకుడు రైల్వే కోడూరు నియోజక వర్గం పరిధిలోని ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతో హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోసానిని రైల్వే కోడూరుకు తరలించారు. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించడంతో రాజంపేట సబ్‌జైల్లో ఉంచారు.

ఈ విచారణ జరుగుతుండగానే పీటీ వారెంట్‌పై నరసరావుపేట పోలీసులు పోసానిని నరసరావుపేటకు తరలించారు. నరసరావుపే టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో 153, 504, 67 సెక్షన్‌ల కింద పోసానిపై ఇది వరకే కేసు నమోదు చేశారు. దీంతో తాజాగా సోమవారం విచారణ చేపట్టిన పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు పోసానికి రిమాండ్‌ విధించింది. విచారణ అనంతరం పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆయనను గుంటూరు కోర్టుకు తరలించారు. మార్చి 13 వరకు పోసానికి రిమాండ్‌ విధించింది.

మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా పోసాని మీద కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 17 కేసులు పోసానిపై ఫైల్‌ చేశారు. తాజాగా చిత్తూరు జిల్లాలో పోసాని మీద కేసు మరో నమోదు చేశారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై పోసానిపై కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోసానిని అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
Tags:    

Similar News