తాజాగా మరొకటి.. ట్రెండింగ్‌గా మారిన పవన్‌పై ప్రకాష్‌రాజ్‌ ట్వీట్లు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రకాష్‌రాజ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

Update: 2024-09-26 09:45 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పై జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ చేస్తున్న ట్వీట్‌లు ట్రెండింగ్‌ మారాయి. ఇప్పటికే పలు మార్లు పోస్టులు పెట్టిన ప్రకాష్‌ రాజ్‌ తాజాగా మరో ట్వీట్‌ చేశారు. ‘గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం...ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ తెలుగులో తాజాగా ట్వీట్‌లో పోస్టు చేశారు. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకాష్‌రాజ్‌ ఈ పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టారు. ఎందుకోసం పెట్టారు అనేది నెట్టింట చర్చగా మారింది. పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు లడ్డూ ప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలకు తమిళ నటుడు కార్తీ చెప్పడంపై ‘చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో’ అని బుధవారం ట్వీట్‌ చేశారు.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం, దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తున్న తీరును ఉద్దేశించి జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ వరుసగా ప్రకాష్‌రాజ్‌ వరుసగా ట్వీట్‌ల మీద ట్వీట్‌లు చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న స్టేట్‌లోనే లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది. మీరు అధికారంలో ఉన్నారు. దీనిపై విచారించి దోషులను శిక్షించండి. కానీ అనవసర రాద్దాం చేయకండి. ఇప్పటికే మత కల్లోలాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్వీట్‌ చేశారు. దీనిపైన సీరియస్‌గానే పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ఒక వైపు మీరంటే గౌరవం అంటూనే ప్రకాష్‌రాజ్‌కు వార్నింగ్‌ ఇచ్చినంత పని చేశారు. దీనిపైన స్పందించిన ప్రకాష్‌రాజ్‌ మీరు మాట్లాడిన ప్రతి మాటకు ఇండియాకు వచ్చిన తర్వాత సమాధానం చెబుతానని, నేను చెప్పిందాన్ని మీరు అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు. మీకు తీరిక ఉంటే మరొక సారి చదివి అర్థం చేసుకోండని ట్వీట్‌ చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అప్పటి నుంచి వరుస ట్వీట్‌లతో పవన్‌ కళ్యాణ్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
Tags:    

Similar News