సినీ హీరో ఇన్ కాదంబరి జత్వానీ కేస్

ముంబై హీరో ఇన్ జత్వానీ గురువారం ఆన్లైన్లో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యాసాగర్ తప్పుడు కేసు పెట్టి గత ప్రభుత్వ బలంతో తనను వేదించారని ఆరోపిస్తోంది.

Update: 2024-08-29 11:54 GMT

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన స్నేహితుని కోసం ఏకంగా ఒక కేసులో ఇరుక్కో బోతున్నారా? అవుననే అంటున్నారు కొందరు పోలీస్ అధికారులు. ముంబై సినీనటి కాదంబరీ జత్వానిపై వేధింపులకు ఏపీ ప్రభుత్వం గతంలో పాల్పడిందనే ఆరోపణలపై ఆమె నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు జత్వాని ఫిర్యాదును విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు గురువారం మధ్యాహ్నం స్వీకరించారు. ఈ మేరకు దర్యాప్తు జరగనుంది. ఇందులో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ప్రధాన పాత్ర పోషించినట్లు ఇప్పటికే జత్వాని ఆరోపించారు. వారిపై కూడా కేసు నమోదు చేయననున్న

ట్లు సమాచారం. తన స్నేహితుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌ను రక్షించడం కోసం సరిదిద్దుకోలేని తప్పు చేశారనేది ఆరోపణ. ముంబయి హీరోయిన్‌ కాదంబరి జత్వాని ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌కు ప్రేమాయణమో, అక్రమ సంబంధమో, మరే రాచకార్యమో గానీ గట్టి సంబంధం ఉంది. కొంతకాలం బాగానే నడిచినా అది బెడిసి కొట్టి ఇద్దరు విడిపోయారు. వారి మధ్య ఉన్న గొడవలు ముదిరిపోయి జత్వాని ముంబయిలో సజ్జన్‌పై రేప్‌ కేసు పెట్టింది. ఆ కేసు నుంచి బయటపడేందుకు సజ్జన్‌ తన మిత్రుడైన ఏపీ సీఎం జగన్‌ను అప్పట్లో ఆశ్రయించారు. ఎక్కడో ముంబయిలో జరిగినదానికి తానేం చేయగలనని ఆయన సున్నితంగా తిరస్కరించవచ్చు. కానీ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం, ఆర్థిక సంబంధాలు ఆ పని చేయనివ్వలేదు. మిత్రుణ్ణి ఎలాగైనా బయటపడేయాలని తన వందిమాగధులకు పురమాయించేశాడు.

జత్వానీకి వైఎస్సార్‌సీపీతో దూరపు సంబంధం ఉన్న కుక్కల విద్యా సాగర్‌తోనూ లింకు ఉంది. సజ్జన్‌ జిందాల్, జత్వానీ, కుక్కల విద్యా సాగర్‌.. ఈ ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారమే ఇప్పుడు బయటకు వచ్చిన ఇన్ని ట్విస్ట్ లకు కారణమైంది. ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్‌కు ఉన్న భూమిని జత్వానీ కొనుగోలు చేసిందట. ఎక్కడో ముంబయిలో ఉండే సినీ నటి తనకు ఏమాత్రం పరిచయం లేని, అసలు తనకు తెలియని విజయవాడలో భూమి కొనడం ఏమిటి? అంటే విద్యా సాగర్‌తోనూ ఏదో బలమైన బంధమే ఉండి ఉండాలి. దానికి సంబంధించిన లావాదేవీపైనే కుక్కల విద్యా సాగర్‌ ఆమెపై కేసు పెట్టాడు. సజ్జన్‌ కోసం తెలివిగా విద్యా సాగర్‌తో ఈ కేసు పెట్టించారనేది ప్రస్తుతం జగన్ పై ఆరోపణ. విద్యా సాగర్‌కి, జత్వానీకి మధ్య కూడా గాఢమైన బంధమే ఉందని చెబుతున్నారు. దీంతో అతనితో కేసు పెట్టించి దాన్ని ఉపయోగించుకుని ఆమె కుటుంబం మొత్తాన్ని వేధించి ముంబయిలో సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేశారనటంలో సందేహం లేదని చెప్పొచ్చు. ఇందులో అప్పటి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నీది కీలకపాత్ర ఉందని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సీఎం ఆదేశం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వారికి ఆ సెటిల్మెంట్‌ చేయకతప్పలేదు. మధ్యలో సెటిల్మెంట్‌ ఎంతవరకు వచ్చిందో ఫాలోఅప్‌ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి చేశారనేది వాస్తవమని పలువురు అంటున్నారు. పూర్తిగా అప్పటి సీఎం జగన్‌ కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా నడిచిందని ప్రచారం సాగుతోంది.

టీడీపీ అధికారంలోకి రావడంతో గోప్యంగా జరిగిన ఈ మొత్తం భాగవతం బయటకొచ్చింది. ఈ కేసులో కాదంబరి జత్వానికీ అన్యాయం జరిగిందనడంలో సందేహం లేదు. అలా అని ఆమె పూర్తిగా అమాయకురాలనీ చెప్పలేం. ఆమె పలువురికి హనీ ట్రాప్‌ వేసిందని, అందులో సజ్జన్, విద్యాసాగర్‌ ఉన్నారని చెబుతున్నారు. ఆ ఉచ్చులోంచి బయటపడే క్రమంలోనే ఇదంతా జరిగినట్లు మరో వాదన వినిపిస్తోంది. ముంబయి వ్యవహారాలు అలాగే ఉంటాయి. అందులో జగన్‌ దూరడం ఏమిటి? దానికోసం తన ఫుల్‌ పవర్‌ను ఉపయోగించడం ఏమిటి? సజ్జన్‌కు నో చెప్పలేని పరిస్థితుల్లో ఇదంతా చేయాల్సివచ్చిందని జగన్ సన్నిహితులు అంటున్నారు. సజ్జన్‌ జిందాల్‌ను రక్షించే క్రమంలో జగన్ అభాసుపాలు కావాల్సి వచ్చిందనేది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. గతంలో పనిచేసిన ఇద్దరు పోలీసు అధికారులు, ఫిర్యాదుదారు, గతంలో జత్వానీపై ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే వాస్తవాలు తెలుసు. ఈ వాస్తవాలను వెలికి తీయడంలో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News