మ్యూజికల్ నైట్ కు కోడ్ వర్తించదా
విజయవాడ స్టేడియంలో జరిగిన మ్యూజికల్ నైట్కు ఎన్నికల కోడ్ వర్తించదా? అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.;
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. గుంటూరు పర్యటనలో జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉంటుంది. జగన్ ఎక్కడికి వెళ్లినా.. మాజీ సీఎం హోదాలో ఆయనకు అక్కడ భద్రత కల్పించాలి. కానీ బుధవారం జగన్ చేపట్టిన గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ భద్రత విషయంలో తమకు తీవ్ర ఆందోళన ఉందని వెల్లడించారు. జగన్ భద్రత ఆందోళననే గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జగన్కు భద్రత కల్పించాలని గవర్నర్ను కోరామన్నారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.