తిరుమల ఫుట్ పాత్ లో కమాండ్ కంట్రోల్ రూం
తిరుమట ఘాట్ లో 7వ మైలు ఎందుకు ప్రమాదకరమయింది?;
యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అలిపిరి-తిరుమల ఫుట్-పాత్ 7వ మైలు వద్ద శాశ్వత కమాండ్ కంట్రోల్ రూమ్ (Command-Control Room) ను ఏర్పాటు చేయనుంది. ఇది ఈ ఫుట్ పాత్ మార్గంలో అత్యంత ప్రమాదకరమయిన ప్రాంతంలోకి వస్తుంది. గత రెండేళ్లలో చిరుత దాడిలో ఒక బాలిక చనిపోవడం, అనెేక సార్లు చిరుతలు, ఎలుగుబంట్లవంటి వన్యమృగాలు ఈ ప్రాంతంలో కనిపించడంతో రక్షణ కోసం,అత్యవసరం సయమంలో వెన్వెంటనే స్పందించేందుకు ఈకమాండ్ కంట్రోల్ రూం ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారని టిటిడి వర్గాలు తెలిపాయి.
వన్యమృగ జీవశాస్త్ర నిపుణులను, టిటిటి విజిలెన్స్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బందిని సుమారు 30 మంది ఈ కంట్రోల్ రూమ్ లో నిరంతరం అందుబాటులో ఉంటారు. వీళ్లుఅడవిలో ఉన్న ఫీల్డ్ సిబ్బంది సమన్వయం ఏర్పాటుచేసుకుని అత్యవసరమయినపుడ తక్షణం స్పందించేందుకు అప్రమత్తంగా ఉంటారు.
ఈ మధ్య తిరుమల ఫుట్ పాత్ మీద సరైన భద్రత లేదనే విమర్శలు రావడంతో ప్రభుత్వం వచ్చాక భద్రతను సమీక్షించి టిటిడి ఈచర్యలు తీసుకుంటున్నదని ఈ వర్గాలు తెలిపాయి.
2023 ఆగస్టు 11 తిరుమలకు కాలిబాటను నడుస్తూ వెళ్తున్నపుడు లక్షిత అనే ఆరేళ్ల బాలిక మీద చిరుతపులి దాడి చేసింది. కాలి బాట ఏడవ మైలు వద్ద జరిగిన దాడిలో బాలిక చనిపోయింది. లక్షిత మృతదేహం మరుసటి రోజు ఉదయం అక్కడి పొదలలో కనిపించింది. ఇది బాగా కలకలం సృష్టించింది. కాలిబాట మార్గంలో టిటిడి భక్తులకు భద్రత కల్పించ తల్లితండ్రులు ఆరోపించారు. అయితే, అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది దీనికి తల్లితండ్రులే కారణమన్నారు. మొత్తానికి ఈ దుర్ఘటన పెద్ద రచ్చకు దారి తీసింది. ఈ మధ్య తరచు చిరుతపులులు, ఎలుగు బంట్లు కనిపిస్తున్నాయి. దీనితో యాత్రికులలో భయాందోెళన మొదలయింది. రోజు వేలాది మంది తిరుమలకు కాలిబాటన చేరుకుంటారు. ఈ దాడితో కాలిబాట సురక్షిత కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తర్వాత టిటిడి ఈ దారిలో రక్షణ చర్యలు చేపట్టింది.భక్తులకు భద్రతకోసం కర్రలు అందించారు. కెమెరాలు అమర్చారు. దారిపొడుగుతన్న చెత్తచెదారాన్ని తొలగించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15లోపు పిల్లలకు కాలిబాటన రాకుండ నిషేధం విధించారు.
ఆప్రాంతంనుంచి ఆరు చిరుతలను పట్టుకుని మరొక ప్రాంతానికి తరలించారు. యాత్రికుల భద్రతకోసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. అయితే, ఆ ప్రాంతంలో చిరుతలు, ఎలుగుబంట్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి..
అటవీ శాఖ, TTD సంయుక్త చొరవ ద్వారా నిఘా ఇప్పటికే బలోపేతం చేయబడినప్పటికీ, రాత్రిపూట జంతువుల అలికిడిని ట్రాక్ చేయడానికి, వన్య ప్రాణుల దాడి నుంచి యాత్రికులను రక్షించడానికి కీలకమైన ప్రదేశాలలో నలభై లైవ్-ఫీడ్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలను ఏర్పాటు చేశారు.
తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి ఏడవ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని బుధవారం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి
పర్యవేక్షణ, తక్షణ ప్రతిస్పందన కోసం కొత్త కంట్రోల్ రూమ్ కేంద్రంగా పనిచేస్తుంది. వన్యప్రాణి జీవశాస్త్రవేత్తలు, అటవీ శాఖ సిబ్బంది, టిటిడి విజిలెన్స్, ఫారెస్ట్ వింగ్ సభ్యులతో సహా దాదాపు 30 మందిని సిబ్బందిగా నియమించనున్నారు. ఇది క్షేత్ర బృందాలతో సమన్వయం చేసుకుంటుంది, సకాలంలో జోక్యం కోసం నిఘా డేటాను ప్రాసెస్ చేస్తుంది.
కమ్యూనికేషన్ను మెరుగుపరచడానికి తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్, 7వ మైలు వద్ద ఉన్న ఫారెస్ట్ మ్యూజియం వద్ద బేస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. నిరంతర క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం పెట్రోలింగ్ బృందాలకు ఇరవై వాకీ-టాకీ సెట్లను కూడా అందించనున్నారు.
అలిపిరి పాదాల మండపం, నరసింహ స్వామి ఆలయం మధ్య ఉన్న ప్రాంతాన్ని అత్యధిక ప్రమాదకర ప్రాంతంగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా తెల్లవారు జామున, అర్దరాత్రి వేళల్లో చిరుతలు, ఎలుగుబంట్లు వాటి పిల్లలతో కలిసి చీకటి పడ్డాక తిరుగుతున్నాయి. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
2025 మార్చినెలలో అలిపిరి గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గం చిరుత సంచరించింది. అది అక్కడ ఉన్న ఒక పిల్లి వెటాడి తీసుకుని వెళ్లింది. ఇదంగా అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలలో రికార్డయింది.
మళ్లీ 2025 మే నెలలో తిరుమల ఘాట్ రోడ్లలో చిరుత సంచారం కనిపించింది. తిరుమల రెండో ఘాట్రోడ్డులోని వినాయకస్వామి ఆలయ సమీపంలో తాజాగా చిరుత సంచారం కలకలం రేపింది.ఆలయ సమీపంలో సోమవారం చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో వాహనదారుల కంటపడింది. వెంటనే వారు అప్రమత్తమై టీటీడీ(TTD) అలిపిరి భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఇలా ఇవి అడవిలోసంచరిస్తూ ఫుట్ పాత్ వైపు వస్తున్నాయని అధికారులుచెబుతున్నారు. ఈ సంఘటలన్నీ కాలిబాట లో అభద్రత సృష్టించాయి.
2025 జూన్ 2న తిరుమల మెట్ల మార్గంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సమయాల్లో చిరుత పులులు కన్పించాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో 500వ మెట్టు ఉదయాన్నే తిరుమలకు వెళ్తున్న భక్తులు దట్టమైన పొదల మాటున సేదతీరుతున్న చిరుతను చూపి భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చి సైరన్ మోగించారు. అరగంట పాటు భక్తుల పాదయాత్రను చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు చెకింగ్ పాయింట్ వద్ద నిలిపివేశారు. చిరుత ఆ ప్రాంతాన్ని వదిలి శేషాచల అడవుల్లోకి వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక భక్తులను గుంపులుగా తిరుమల వెళ్లేందుకు అనుమతించారు
ఎత్తైన న నడక మార్గాన్ని(Elevated Walkway) ఏర్పాటు చేయాలని దీర్ఘకాలికంగా చర్చలో ఉన్నప్పటికీ, తక్షణ, ఆచరణాత్మక చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త కమాండ్ సెంటర్ ప్రతిస్పందన, యాత్రికుల భద్రతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.