5నెలల్లో ఈటల ఆస్తి పెరిగింది-కేసులూ పెరిగాయి

మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఆస్తులు ఐదు నెలల్లో బాగానే పెరిగాయి. వాటితో పాటు కేసులు కూడా పెరిగాయి. అవి ఎంత మేర అంటే..

Update: 2024-04-20 11:17 GMT
Source: Twitter

మల్కాజిగిరి పార్లమెంటు నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఆస్తులు గడచిన 5 నెలల్లో బాగా పెరిగాయి. ఈమేరకు పార్లమెంటు అభ్యర్థిగా దాకలు చేసిన అఫిడవిలో వివరించారు. తన ఆస్తుల విలువ రూ.54.01 కోట్లు అని వెల్లడించారు. తనకు రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. సతీమణి జమున పేరుపై 1.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా తనపై 54 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు, తన కుటుంబం పేరిట 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫాంలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నట్లు వివరించారు.

5 నెలల్లో రూ.7 లక్షలు పెరిగందట.....

ఈటల రాజేందర్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన అఫిడవిట్‌లో ఆస్తులు గడిచిన ఐదు నెలల్లో రూ.7 లక్షలు పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే 2023 నవంబర్‌లో హుజూరాబాద్, గజ్వేల్‌ నుంచి ఈటల పోటీచేశారు. అప్పుడు వేసిన నామినేషన్లలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ. 53.94 కోట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఎంపీగా నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తి రూ.54.01 కోట్లుగా పేర్కొన్నారు. అంటే ఐదు నెలల్లో రూ.7 లక్షల ఆదాయం పెరిగింది. ఇక కేసుల విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 40 కేసులు ఉన్నట్లు తెలుపగా, తాజాగా వాటి సంఖ్య 54కు పెరిగింది. స్థిరాస్తులు రూ.12.50 కోట్లు, చరాస్తులు రూ.16.74 లక్షలు ఉండగా, అప్పులు రూ.3.48 కోట్లుగా చూపించారు. తన భార్య పేరిట రూ.14.78 కోట్ల స్థిరాస్తులు, రూ.26.48 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. తన భార్య పేరిట రూ.15.51 కోట్ల అప్పులు ఉన్నట్లు వివరించారు.

Tags:    

Similar News