"మా నాన్నతయారు చేస్తుంటే ఆయనతో పాటు నేను నేర్చుకున్నా. మా తాత ఎస్. దాస్ కు 1982లో నంది అవార్డు దక్కింది. అవార్డు వచ్చిన తరువాత కాలనీకి ఒక రూపం వచ్చింది. వీళ్ల ప్రతిభని, పేదరికాన్ని ప్రభుత్వం గుర్తించి, ఇళ్లు మంజూరు చేసింది. అదే ఈ బొమ్మలకాలనీ," అని రాముడు చెప్పారు.
కుటీర పరిశ్రమగా..
బొమ్మలకాలనీలో వినాయకుడి విగ్రహాల తయారీని కుటీర పరిశ్రమగా మార్చేశారు. ఏటా జనవరి నుంచి బొమ్మల తయారీ ప్రారభం అవుతుంది. ఇక్కడ అడుగు నుంచి 18 అడుగుల విగ్రహాల వరకు రూపుదిద్దుకుంటున్నాయి.
ఇక్కడికి తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల నుంచి సుమారు 10 కుటుంబాలు 1970కి తిరుపతికి వచ్చాయి. మంగళం సమీపంలో రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించారు. ఒక అడుగు విగ్రహం నుంచి 18 అడుగుల విగ్రహాలను తయారు చేయడంలో వీరు నేర్పరులు. మొదట చిన్నపాటి మట్టి విగ్రహాలను తయారు చేయడం ద్వారా విక్రయాలు ప్రారంభించారు.
ఆ కుటుంబాల సంఖ్య ప్రస్తుతం 350 కుటుంబాలకు పెరిగాయి. ఐదు దశాబ్దాల కాలచక్రంలో వారి కుటుంబంలో పెద్దలు, పిల్లలు విగ్రహాల తయారీలో ఉన్నారు. పిల్లలకు చదువు చెప్పించే అలవాటు లేదు. బయటినుంచి ప్రోత్సాహం లేదు. కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ కాలనీలో విఘ్నేశ్వర పేరర్ అండ్ టెర్రకోట బొమ్మల కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘం ప్రతినిధి రాముడు మూడో తరం వ్యక్తి. ఈయన తాత దాసు తమిళనాడు నుంచి వచ్చిన వారిలో మొదటి తరం కళాకారుడు
చిదంబరం సమీపంలోని శీర్గాయ్ నుంచి మొదట ఈ ప్రాంతానికి వచ్చిన రవిచంద్రన్ వారసత్వంగా బొమ్మలు చేస్తున్న మేలుమరుత్తూరు నుంచి వచ్చిన రవి ఇంకొందరు కుటుంబాల్లో వినాయకుడి విగ్రహాల తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. ఆ కుటుంబాల్లో పాండిచ్చేరి నుంచి వచ్చిన వైదీశ్వరన్ కూడా చేరారు. చిత్తూరు జిల్లాలో తమిళ భాష ప్రాచుర్యం ఎక్కువ. దీంతో బొమ్మల కాలనీలోని విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. అందుకు మరో కారణం ఇక్కడి బొమ్మలు పెద్దవిగా ఉన్నా, బరువు లేకపోవడం వల్ల కొనుగోళ్లు పెరిగాయి.
బరువు చాలా తక్కువ
సాధారణంగా 18 అడుగుల విగ్రహం టన్ను బరువు ఉంటుంది. కానీ బొమ్మల కాలనీలో కళాకారులు తయారు చేసే విగ్రహం తేలికగా ఉంటుంది. ఇది పర్యావరణానికి మేలు చేసేదే అని ఇక్కడి కళాకారులు చెబుతున్నారు.
"పర్యావరణాన్ని కాపాడాలనే ప్రభుత్వం సూచనలు పాటిస్తున్నాం" అని అసోసియేషన్ ప్రతినిధి రాముడు, మరో మహిళా కళాకారిణి భాగ్యలక్ష్మి చెప్పారు. పదో తరగతి, ఐటీఐ చదివిన సరళ, విజయ్ దంపతుల కొడుకులు ఆర్. కన్నన్, కదిరి వేల్ (iti) ఇవే విషయం స్పష్టం చేశారు. చెప్పారు.
విగ్రహం తయారీ కోసం ఇక్కడి కళాకారులు వినియోగించే పదార్ధాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అభినందించక తప్పదు కూడా. ప్లాస్టో పారిస్, చైనా రంగులు ఇక్కడ మచ్చుకు కూడా కనిపించవు.
బొమ్మల కాలనీ గణేశుడి విగ్రహాలు నిజ్జంగా పర్యావరణానికి మేలు చేసేవే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
1. మైదాపిండి,
2. కాగితాలు, కాగితం గుజ్జు
3. మైదా మావ్ (మైదా పిండి), ఆళ్వారి గడ్డ (ఆలు గడ్డ), స్వల్పంగా ముగ్గు పిండి.
4. ఆలుగడ్డ తొక్కలు తీసి, ఎండబెడతారు. ఎండిన తరువాత పిండి మార్చి గుజ్జుగా తయారు చేస్తారు.
5 చెక్కతో తయారు చేసిన పీఠం చుట్టూ, రంగులు కలపని పదార్థం అతికిస్తారు. ఆ తరువాత బొమ్మ తయారీ కోసం సిద్ధం చేసిన మైదాపిండి, ఆలుగడ్డ పొడి గుజ్జు, కాగితాలతో విగ్రహాన్ని సిద్ధం చేస్తారు.
పాండిచ్చేరి నుంచి వచ్చిన మొదటితరం కళాకారుల్లో పసుపులింగం మనువరాలు భాగ్యలక్ష్మి ఏమంటున్నారంటే..