కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం

వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతున్నట్టు షర్మిల ప్రకటించారు.

Byline :  The Federal
Update: 2024-01-04 06:26 GMT
రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. AICC కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భర్త అనిల్‌తో కలిసి కాసేపటి క్రితం AICC కార్యాలయానికి వచ్చిన షర్మిల..కాసేపటి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతున్నట్టు షర్మిల ప్రకటించారు. ఇవాళ్టి నుంచి YSRTP కాంగ్రెస్‌లో అంతర్భాగమన్నారు. YSRTP నేతలు, కార్యకర్తలు తనతో పాటు..కాంగ్రెస్‌లో సంతోషంగా విలీనం అయ్యారన్నారు. వైఎస్ఆర్‌ కుమార్తెగా కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్‌..తన జీవితం మొత్తం కాంగ్రెస్‌కు అంకితం చేశారన్నారు. కాంగ్రెస్‌కు సేవ చేస్తూనే వైఎస్ఆర్ చనిపోయారన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరడం వైఎస్‌ఆర్‌కు ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నది తన తండ్రి కల అని అన్నారు. తన తండ్రి కల నెరవేర్చడానికి ఎప్పుడూ కృషిచేస్తానని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ కోసం చేసిన త్యాగాన్ని గుర్తించి..తనను పార్టీలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ విధేయురాలిగా ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా..నిర్వహిస్తానన్నారు. కాంగ్రెస్‌ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్నారు. రాహుల్, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజలందరికీ న్యాయం చేస్తుందని అన్నారు.

కీలక బాధ్యతలు ఆమెకే...
YSRTPని కాంగ్రెస్‌లో విలీనం చేసిన వైఎస్.షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ప్రధానంగా త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్‌ కూతురిగా, ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలిగా షర్మిలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే YSRTP పేరుతో తెలంగాణలో పార్టీని స్థాపించి... బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తానే అంటూ విమర్శలు, ఆందోళనలు, ట్విట్లతో గట్టి పోటీ ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుపు కోసం అధిష్టానం ఆదేశాలతో ఆమె సైలెంట్‌గా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో విలీనంపై ఆమె నిర్ణయం తీసుకున్నారు.

Delete Edit

అంతకుముందు ఏం జరిగిందంటే...
తన కుమారుడి వివాహానికి సోదరుడు సీఎం జగన్‌కు ఆహ్వానం అందించిన వైఎస్.షర్మిల కుటుంబసభ్యులతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌ ఇంటికి వెళ్లిన షర్మిల.. వివాహానికి రావాలని పెళ్లి పత్రిక అందించారు. సుమారు అరగంట పాటు జగన్‌ నివాసంలో ఉన్నారు షర్మిల. అయితే ఈ సమావేశం కేవలం వివాహా ఆహ్వానానికే మాత్రమే పరిమితమైంది. రాజకీయాలు, కుటుంబ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదు. షర్మిల వెంట విజయమ్మ రాకపోవడంతో ఇరువురి భేటీ పెళ్లి ఆహ్వానానికే పరిమితమైంది. రాజకీయంగా ఎవరిదారి వారిదే కావడంతో పాలిటిక్స్‌పై ఎలాంటి చర్చ జరగనట్లు సమాచారం. అనంతరం షర్మిల ఢిల్లీకి వెళ్లారు. షర్మిలకు ఏం బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News