సైకిల్ ఎక్కిన రఘురామ.. ‘ప్రభంజనం పక్కా’..

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.. టీడీపీలో చేరారు. జగన్‌ను ఓడించే సత్తా తనకుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-06 04:18 GMT
Source: Twitter

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పోటీపై ఇన్నాళ్లూ కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. చెప్పినట్లే ఆయన టీడీపీ గూటికి చేరారు. పాలకొల్లు ప్రజాగళం సభలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతో మరోసారి ప్రజల పక్షాన పోరాడే అవకాశం దక్కిందని చెప్పారు. జూన్ 4న రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించబోతోందని, భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు బుద్ది చెప్పడానికి ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారని, ఆ సమయం రానే వచ్చిందని, మే 13న ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని అన్నారాయన. టీడీపీ కండువా కప్పుకోవడానికి ముందు కూడా రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ఓడించే సత్తా తనకు ఉందని వెల్లడించారు.

అదే నా ఆశయం

‘‘జగన్‌ను ఓడించగల సత్తా నాకుంది. ఆ స్థాయికి నేను ఎదిగాను. ఈ ఎన్నికల్లో నాకు తప్పకుండా టికెట్ వస్తుంది. విజయం కూడా సాధిస్తా. కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే నా ఆశయం. నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనే దానిపై అనేక మంది అనేక సలహాలు ఇస్తున్నారు. కానీ ఆ విషయంలో నాకంటూ ఒక క్లారిటీ ఉంది. ఎక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలబడినా నన్ను ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉంది. ఎన్నికల నుంచి నన్ను దూరంగా ఉంచడానికి కొన్ని శక్తులు తీవ్ర స్థాయిలో కుట్రలు చేస్తున్నాయి. అయినా నన్ను ఆపలేరు. నాదెప్పుడు ప్రజాపక్షమే’’అని చెప్పారు రఘురామ.



Tags:    

Similar News