ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సీఎస్ ఖారారు..?

ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కూడా మారారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డి స్థానంలో కొత్త సీఎస్ ఖరారు అయ్యారు.

Update: 2024-06-06 09:16 GMT

ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కూడా మారారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డి స్థానంలో కొత్త సీఎస్ ఖరారు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే విజయానంద్ ఫైనల్ అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత రాష్ట్రంలో ఐఏఎస్ అధికారు పోస్టింగ్‌లలో కీలక మార్పులు జరగనున్నాయని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.

అసలు కారణం అదే..

ప్రభుత్వం మారిన తర్వాత సీఎష్ మారుతున్నట్లు వస్తున్న వార్త నేపథ్యంలో.. ఇందుకు జవహర్ రెడ్డి ఎదుర్కొంటున్న ఆరోపణలే కారణమని ప్రచారం జరుగుతోంది. కానీ జవహర్ రెడ్డి పదవీకాలం జైన్ నెలాఖరుకు ముగుస్తుండటంతోనే కొత్త సీఎస్‌ను ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా విజయానంద్‌తో పాటు మరికొందరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయానంద్ ఎవరు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్‌. ఆయన వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు, పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్‌గా, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Tags:    

Similar News