పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేసీఆర్ పరామర్శ

కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం నేరుగా ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్.;

Update: 2025-06-11 08:39 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కాలి గాయం కారణంగా యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాలు జారి పడటంతో ఆయన కాలికి గాయమైంది. ఆయనను అడ్మిట్ చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్.. ఈరోజు ఆయనను పరామర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణను ముగించుకున్న అనంతరం ఆయన నేరుగా యశోధ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డితో మాట్లాడారు. ఆయనకు తగిలిన గాయం గురించి, అందిస్తున్న వైద్యం గురించి వైద్యులతో కూడా కేసీఆర్ మాట్లాడారు. అయితే కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన నేతలో పల్లా కూడా ఉన్నారు. అక్కడే ఆయన ప్రమాదవశాత్తి జారి పడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తుంటి ఎముకకు గాయమైనట్లు గుర్తించారు.

Tags:    

Similar News