పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 14
మరో 5 గురి పరిస్థితి విషమం;
పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన మృతుల సంఖ్య 14కి చేరుకుంది. సోమవారం పటానుచెరు పారిశ్రామిక వాడలోరియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్యగా క్రమంగా పెరుగుతోంది. షిప్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నారనే దానిమీద స్పష్టమయిన సమాచారం లేదు. 150 మందికి పైగా పని చేస్తున్నారని కొందరు చెబుతుంటే ప్రమాదం జరిగిన బ్లాక్ లో 90 మంది ఉన్నారని కొందరు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం మృతుల సంఖ్య 14 కి చేరుకుంది.
సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో మైక్రో క్రిష్టలైన్ సెల్యూలోజ్ పౌడర్ ( Microcrystalline Cellulose powder) తయారవుతుంది.
పాశమైలారం పేలుడులో మూడు అంతస్థుల భవనం కూలిపోయిందని ఘటనా స్థలం సందర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. పేలుడు ధాటికి కంపెనీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్, మానుఫ్యాక్చర్ యూనిట్లలోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీలో ఎక్కడ పడితే అక్కడ క్షత గాత్రులు పడిపోయారు. ప్రాణాపాయ స్థితిలోఉన్న వారిని ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సంగారెడ్డి కలెక్టర్ , ఎస్ పి ప్రమాద స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు.
"ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సుమారు 65 మంది ఘటన జరిగిన సమయంలో పనిలో ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. వారికి పూర్తి చికిత్స ఉచితంగా అందించే బాధ్యత మా ప్రభుత్వానిది. ప్రతి కార్మికుని కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత, ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానిది,"అని మంత్రి చెప్పారు.