నియోజక వర్గాల పునర్విభజనపై సుప్రీం కీలకతీర్పు
ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటీషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు;
ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది.కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జన గణన తరువాతే నియోజక వర్గాల పెంపు వుంటుందని కోర్టు తేల్చేసింది.నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి ఈ పిటీషన్ వేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్సింగ్ ధర్మాసనం ఈ పిటీషన్ పై విారణ జరిపి తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. జమ్ముకశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్పై ప్రత్యేక దృష్టి సారించారన్న పిటిషనర్ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది.కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.