తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం..!
తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడో మైలు వద్ద ఏనుగుల సంచారం - ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు శ్రమిస్తున్న అటవీ సిబ్బంది;
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఘాట్ రోడ్డులోని ఏడోవ మైలు వద్ద ఏనుగులు గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి.సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు, తిరుమల ఫారెస్ట్ సిబ్బంది వాటిని ఘాట్రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకొని వాటిని పక్కనే ఉన్న అరణ్యంలోకి వెళ్లేలా బెదరగొడుతున్నారు. మరోవైపు కొండపైకి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు కూడా హెచ్చరికలు జారి చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు అలర్ట్గా ఉండాలని టీటీడీ ప్రకటించింది. తిరుమల చుట్టూ శేషాచలం అడవి ప్రాంతం ఉండటంతో అక్కడ ఉండే పులులు, ఏనుగులు తరచూ ఘాట్ రోడ్డులో సంచరించడం చూశాం. తాజాగా ఓ ఏనుగుల గుంపు మొదటి ఘాట్ రోడ్డులోని ఏడోవ మైలు వద్ద బీభత్సం సృష్టించాయి. వెదురు చెట్లను ధ్వంసం చేశాయి.