హైదరాబాద్ చేరుకున్న సోనియా గాంధీ

Update: 2023-12-07 05:25 GMT
కాంగ్రెస్ గుర్తు

తెలంగాణ సీఎంగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు హజరు అవుతున్నారు. అందులో భాగంగా సోనియాగాంధీ, రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి టీపీసీసీ ప్రెసిడెంట్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం సోనియాతో పాటు నేరుగా వీరంతా తాజ్ హోటల్ చేరుకున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం చేరుకుని రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారంలో పాల్గొంటారు. సాయంత్రం మళ్లీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. కాగా ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఎల్పీ స్టేడియంలో చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు హోటల్ ఎల్లా నుంచి ఎల్బీ స్టేడియానికి బస్సుల్లో బయల్దేరారు.

Tags:    

Similar News