పిబతు గీతామృతమ్
భగవద్గీత వంటి గోతోపదేశాలు మహాభారతంలో ఎన్ని ఉన్నాయి?;
మహాభారతేతిహాసంలో మహర్షి వేదవ్యాసుడు మనకు గీతామృతాన్ని అందిందించినారు.
భారతంలో భగవద్గీతాదిగీతలు పదునారు (16) ఉన్నాయి.
వాటి క్లుప్తపరిచయం--
1.భగవద్గీత : మహాభారతంలోని భీష్మపర్వంలో25వ అధ్యాయంనుండి 42వ అధ్యాయం వరకు18అధ్యాయా
లలో విరాజిల్లుతోందిగీత.శ్రీకృష్ణభగవానుడు అర్జునుడికి చేసిన దివ్యోపదేశం భగవద్గీత.ఇది శాస్త్రంగ ఉపనిషత్తుగ
కీర్తించబడుతున్న దివ్యభాగం.
2.ఉతథ్యగీత : మహాభారతశాంతి పర్వంలోని2అధ్యాయాలలో(90-91)ఉతథ్యగీత ఉంది.బ్రహ్మజ్ఞానసంపన్ను
డైన ఉతథ్యమహర్షి మాంధాతృచక్రవర్తికి ధర్మపరిపాలన ఆవస్యకతను ఉప దేశించిన భాగమిది.
3.వామదేవగీత : ఇదిశాంతిపర్వంలో ఉతథ్యగీత తర్వాత 3అధ్యాయా
లలో(92-94)ఉంది.వామదేవమహర్షి వనుమనుడికి ఉపదేశించి నాడని భీ ష్ముడు ధర్మరాజుకు చెప్తాడు.
4.ఋషభగీత : ఇదికూడ శాంతి పర్వంలోనే 4అధ్యాయాలలో(125-128)వివరించబడింది 'ఆశ' విషయం
గ ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముడు ఋషభుని ఉపదేశాన్ని వినిపిస్తాడు.
5.షడ్జగీత : ఇదికూడ శాంతిపర్వం లోని ఉపపర్వమైన ఆపద్ధర్మపర్వంలో ఒక (167) అధ్యాయంలో తెలుపబ డింది.ధర్మరాజు తన తమ్ముళ్లు మరి యు విదురుడుధర్మార్థకామాలలోఏది ఉత్తమమైనదో అనే అంశంగురించి చ
ర్చించబడిన విషయం కనుక దీనిని షడ్జగీత అని పేర్కొన్నారు.
6.శంపాకగీత : శాంతిపర్వంలోని ఒకే ఒక అధ్యాయం(176)లో విరాజి
ల్లుతోంది ఈ గీత.భీష్ముడిని ధర్మరాజు ధనవంతులకూ నిర్ధనులకూ సుఖదుః
ఖాలు ఏ రూపంలో సంక్రమిస్తాయని ప్రశ్నిస్తే శంపాకుడు చెప్పిన ఇతిహాస
న్ని వివరిస్తాడు.
7.మంకిగీత : ఇదికాక శాంతిపర్వం లో శంపాకగీత తర్వాత ఉంది. ఇది కూడ ఒక అధ్యాయం(177)లో ఉంది. ధనాశతోఎంతో ప్రయత్నంచేసినవాడు దానిని పొందాలంటే ఎలా సుఖాన్ని పొందుతారు అన్న ధర్మరాజు ప్రశ్నకు
భీష్ముడుసమాధానంగఈగీత చెప్తాడు
8.బోధ్యగీత : ఒక అధ్యాయంలో (178) విరాజిల్లుతున్న గీత ఇది. ఎలా టి బుద్ధినికలిగిఉంటేశాంతినీ సుఖాన్నీ
పొందవచ్చు అన్న ధర్మరాజు ప్రశ్నకు భీష్ముడు ఈ గీతను చెప్తాడు.
9.విచఖ్నుగీత : ఇది శాంతిపర్వం లోని ఉప పర్వమైన మోక్షధర్మపర్వంలో (265అధ్యాయం) ఉంది. దీనిలో
అహింస ప్రశంస ఉంది.
10.హారితగీత : శాంతిపర్వం ౨౭౮ అధ్యాయంలోఉంది.పరబ్రహ్మను పొందేవారి ప్రవర్తన స్వభావం ఎలాఉండా
లనే హారితుని ఉపదేశం ఇది.
11.వృత్రగీత : ఇది ఒకఅధ్యాయం (279) లో ఉపవర్ణితం. కర్మఫలం గు రించి శుక్రాచార్యుడు వృత్రునికి బోధిం
చిన గీత ఇది.
12 పరాశరగీత : శాంతి పర్వం లోని 290-298అధ్యాయాలలో ఈగీత ఉంది. తొమ్మిది అధ్యాయాలున్న
దీనిలో--మానవుడుఏశుభకార్యాలను ఆచరించి ఇహ పరలోకాలలో పరమ శ్రేయస్సును పొందగలడనే విషయం
జనక పరాశర సంవాదరూపకంగఉంది.
13.హంసగీత : ఇది శాంతిపర్వం లో 299వ అధ్యాయం. సత్య దమాది ప్రశంస దీనిలో ఉంది.
14.బ్రాహ్మణగీత: అశ్వమేధపర్వం లోని అనుగీతపర్వం లో15వఅధ్యా యాలలో(206-346)శ్రీకృష్ణుడు అర్జు
నకు చేసిన ఉపదేశం ఇది.
15.అనుగీత : బ్రాహ్మణగీతానంత రం ఈ గీత 17 అధ్యాయాలలో(35-51)ఉన్న అనుగీత గురుశిష్య సంవాదరూపాత్మకం. అర్జునుడు తనకు శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం మరిచానని చెప్పగా ఆ విషయ పరిజ్ఞానాన్ని
కలిగించే ఇతిహాసాన్ని భగవానుడు ఉపదేశించిన ఇందలి విషయం.
16.యాజ్ఞవల్క్య గీత: భారత శాంతిపర్వంలోని 310అధ్యాయం నుండి 318 అధ్యాయం వరకూ ఈ
గీతను యజ్ఞవల్క్యమహర్షి జనకునకు చేసిన సృష్టివర్ణనాదులు కలిగిన గీత ఇది.
ఇంతటి సద్విషయ సమాహార గీతలు మహాభారత శాంతిపర్వం మనకు అందిస్తుంది. సంస్కృత మహాభారత శాంతిపర్వం తెలుగువ్యాఖ్యానంఉన్నది గీతాసక్తులు తప్పక అధ్యయనం చేయగలరు
పిబతు గీతామృతమ్
(గీతామృతాన్ని గ్రోలండి)
-వైద్యం వేంకటేశ్వరాచార్యులు
(వేంకటేశ్వరాచార్యులు ప్రఖ్యాత సంస్కృత పండితులు. కవి, రచయిత, పరిశోధకులు)