పిబతు గీతామృతమ్

భగవద్గీత వంటి గోతోపదేశాలు మహాభారతంలో ఎన్ని ఉన్నాయి?;

Update: 2025-06-01 12:07 GMT

మహాభారతేతిహాసంలో మహర్షి వేదవ్యాసుడు మనకు గీతామృతాన్ని అందిందించినారు.

భారతంలో భగవద్గీతాదిగీతలు పదునారు (16) ఉన్నాయి.

వాటి క్లుప్తపరిచయం--

1.భగవద్గీత : మహాభారతంలోని భీష్మపర్వంలో25వ అధ్యాయంనుండి 42వ అధ్యాయం వరకు18అధ్యాయా

లలో విరాజిల్లుతోందిగీత.శ్రీకృష్ణభగవానుడు అర్జునుడికి చేసిన దివ్యోపదేశం భగవద్గీత.ఇది శాస్త్రంగ ఉపనిషత్తుగ

కీర్తించబడుతున్న దివ్యభాగం.

2.ఉతథ్యగీత : మహాభారతశాంతి పర్వంలోని2అధ్యాయాలలో(90-91)ఉతథ్యగీత ఉంది.బ్రహ్మజ్ఞానసంపన్ను

డైన ఉతథ్యమహర్షి మాంధాతృచక్రవర్తికి ధర్మపరిపాలన ఆవస్యకతను ఉప దేశించిన భాగమిది.

3.వామదేవగీత : ఇదిశాంతిపర్వంలో ఉతథ్యగీత తర్వాత 3అధ్యాయా

లలో(92-94)ఉంది.వామదేవమహర్షి వనుమనుడికి ఉపదేశించి నాడని భీ ష్ముడు ధర్మరాజుకు చెప్తాడు.

4.ఋషభగీత : ఇదికూడ శాంతి పర్వంలోనే 4అధ్యాయాలలో(125-128)వివరించబడింది 'ఆశ' విషయం

గ ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముడు ఋషభుని ఉపదేశాన్ని వినిపిస్తాడు.

5.షడ్జగీత : ఇదికూడ శాంతిపర్వం లోని ఉపపర్వమైన ఆపద్ధర్మపర్వంలో ఒక (167) అధ్యాయంలో తెలుపబ డింది.ధర్మరాజు తన తమ్ముళ్లు మరి యు విదురుడుధర్మార్థకామాలలోఏది ఉత్తమమైనదో అనే అంశంగురించి చ

ర్చించబడిన విషయం కనుక దీనిని షడ్జగీత అని పేర్కొన్నారు.

6.శంపాకగీత : శాంతిపర్వంలోని ఒకే ఒక అధ్యాయం(176)లో విరాజి

ల్లుతోంది ఈ గీత.భీష్ముడిని ధర్మరాజు ధనవంతులకూ నిర్ధనులకూ సుఖదుః

ఖాలు ఏ రూపంలో సంక్రమిస్తాయని ప్రశ్నిస్తే శంపాకుడు చెప్పిన ఇతిహాస

న్ని వివరిస్తాడు.

7.మంకిగీత : ఇదికాక శాంతిపర్వం లో శంపాకగీత తర్వాత ఉంది. ఇది కూడ ఒక అధ్యాయం(177)లో ఉంది. ధనాశతోఎంతో ప్రయత్నంచేసినవాడు దానిని పొందాలంటే ఎలా సుఖాన్ని పొందుతారు అన్న ధర్మరాజు ప్రశ్నకు

భీష్ముడుసమాధానంగఈగీత చెప్తాడు

8.బోధ్యగీత : ఒక అధ్యాయంలో (178) విరాజిల్లుతున్న గీత ఇది. ఎలా టి బుద్ధినికలిగిఉంటేశాంతినీ సుఖాన్నీ

పొందవచ్చు అన్న ధర్మరాజు ప్రశ్నకు భీష్ముడు ఈ గీతను చెప్తాడు.

9.విచఖ్నుగీత : ఇది శాంతిపర్వం లోని ఉప పర్వమైన మోక్షధర్మపర్వంలో (265అధ్యాయం) ఉంది. దీనిలో

అహింస ప్రశంస ఉంది.

10.హారితగీత : శాంతిపర్వం ౨౭౮ అధ్యాయంలోఉంది.పరబ్రహ్మను పొందేవారి ప్రవర్తన స్వభావం ఎలాఉండా

లనే హారితుని ఉపదేశం ఇది.

11.వృత్రగీత : ఇది ఒకఅధ్యాయం (279) లో ఉపవర్ణితం. కర్మఫలం గు రించి శుక్రాచార్యుడు వృత్రునికి బోధిం

చిన గీత ఇది.

12 పరాశరగీత : శాంతి పర్వం లోని 290-298అధ్యాయాలలో ఈగీత ఉంది. తొమ్మిది అధ్యాయాలున్న

దీనిలో--మానవుడుఏశుభకార్యాలను ఆచరించి ఇహ పరలోకాలలో పరమ శ్రేయస్సును పొందగలడనే విషయం

జనక పరాశర సంవాదరూపకంగఉంది.

13.హంసగీత : ఇది శాంతిపర్వం లో 299వ అధ్యాయం. సత్య దమాది ప్రశంస దీనిలో ఉంది.

14.బ్రాహ్మణగీత: అశ్వమేధపర్వం లోని అనుగీతపర్వం లో15వఅధ్యా యాలలో(206-346)శ్రీకృష్ణుడు అర్జు

నకు చేసిన ఉపదేశం ఇది.

15.అనుగీత : బ్రాహ్మణగీతానంత రం ఈ గీత 17 అధ్యాయాలలో(35-51)ఉన్న అనుగీత గురుశిష్య సంవాదరూపాత్మకం. అర్జునుడు తనకు శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం మరిచానని చెప్పగా ఆ విషయ పరిజ్ఞానాన్ని

కలిగించే ఇతిహాసాన్ని భగవానుడు ఉపదేశించిన ఇందలి విషయం.

16.యాజ్ఞవల్క్య గీత: భారత శాంతిపర్వంలోని 310అధ్యాయం నుండి 318 అధ్యాయం వరకూ ఈ

గీతను యజ్ఞవల్క్యమహర్షి జనకునకు చేసిన సృష్టివర్ణనాదులు కలిగిన గీత ఇది.

ఇంతటి సద్విషయ సమాహార గీతలు మహాభారత శాంతిపర్వం మనకు అందిస్తుంది. సంస్కృత మహాభారత శాంతిపర్వం తెలుగువ్యాఖ్యానంఉన్నది గీతాసక్తులు తప్పక అధ్యయనం చేయగలరు

పిబతు గీతామృతమ్

(గీతామృతాన్ని గ్రోలండి)


-వైద్యం వేంకటేశ్వరాచార్యులు


(వేంకటేశ్వరాచార్యులు ప్రఖ్యాత సంస్కృత పండితులు. కవి, రచయిత, పరిశోధకులు)

Tags:    

Similar News

భిక్షుకి !