తమిళనాడులో డీఎంకే లోక్‌సభ అభ్యర్థులు వీరే..

అధికార డీఎంకే లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 39 స్థానాలలో 21 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది.

Update: 2024-03-20 07:17 GMT

తమిళనాడులో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. చెన్నై ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో బుధవారం (మార్చి 20)వ తేదీ 21 మంది అభ్యర్థుల పేర్లను మీడియాతో పంచుకున్నారు. ఇదే సమావేశంలో ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. మిగిలిన 18 సీట్లను భారత కూటమి మిత్రపక్షాలు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, VCK, ఇతరులకు కేటాయించారు.

అభ్యర్థులు వీరే..

దయానిధి మారన్‌ చెన్నై (సెంట్రల్‌), కళానిధి వీరాసామి చెన్నై (ఉత్తరం), తమిళాచి తంగపాండియన్‌ చెన్నై (సౌత్‌), అరక్కోణం నుంచి ఎస్‌ జగత్రాక్షగన్‌, శ్రీపెరంబుదూర్‌ నుంచి బాలు, వెల్లూరు నుంచి కతిర్‌ ఆనంద్‌ రీనామినేట్‌ అయ్యారు.తిరువణ్ణామలై నుంచి సిఎన్ అన్నాదురై, ధర్మపురి నుంచి ఎ మణి, సేలం నుంచి టిఎమ్ సెల్వగణపతి, ఈరోడ్ నుంచి కెఇ ప్రకాష్, నీలగిరి నుంచి ఎ రాజా, కోయంబత్తూరు నుంచి గణపతి పి రాజ్‌కుమార్, పెరంబలూరు నుంచి అరుణ్ నెహ్రూ, తంజావూరు నుంచి ఎస్ మురసోలి, తమిళసెల్వన్ నుంచి తంగ ఉన్నారు. తేని తూత్తుకుడి నుంచి కనిమొళి ఎన్నికల బరిలో నిలవనున్నారు. వీరితో పాటు 11 మంది కొత్త ముఖాలకు స్థానం కల్పించారు.

మేనిఫెస్టో..

గవర్నర్ నియామకం, ఆర్టికల్ 356 రద్దు అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. గవర్నర్ పదవి ఉన్నంత కాలం రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో గవర్నర్‌ను ఎంపిక చేయాలని కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని, నీట్‌ను నిషేధిస్తామని హామీ ఇచ్చింది. CAA, UCC అమలు చేయమని పేర్కొన్నారు. ఆర్టికల్ 361ను సవరిస్తామన్నారు. ఇది డీఎంకే మేనిఫెస్టో మాత్రమే కాదని, ప్రజల మేనిఫెస్టో అని స్టాలిన్ అన్నారు.  

Tags:    

Similar News