మన ‘గోదావరి ఎక్స్ ప్రెస్’ కు 50 యేళ్లు

ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్ల తో విశాఖ పట్నం - సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది.

Update: 2024-02-01 11:50 GMT




ప్రస్తుతం విశాఖ పట్నం - సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్ల తో విశాఖ పట్నం - హైదరాబాద్  మద్య నడుస్తుంది.

1974 ఫిబ్రవరి 1వ తేదీన మొదటి సారిగా ప్రారంభించిన గోదావరి ఎక్స్ ప్రెస్ వాల్తేర్ - హైదరాబాద్ మధ్య ట్రైన్ నంబర్ 7007 గా, సికింద్రాబాద్ - వాల్తేర్ మధ్య ట్రైన్ నంబర్ 7008 గా ప్రవేశ పెట్టడం జరిగింది.
ప్రారంభంలో ఈ రైలు ఒక రోజు విశాఖ నుంచి మరుసటి రోజు సికిందరాబాద్ నుంచి ప్రారంభమయ్యేది. అంటే విశాఖలో సాయంకాలం 5.20 కి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6.45 కు హైదరాబాద్ చేరుకునేది. ఆ రోజు హైదరాబాద్ లో ఇదే రైలు ఉదయం 5.10 కి బయలుదేరి విశాఖలో మరుసటి ఉదయం 5.50 కి చేరుకునేది.
1999లో ఈ రైలుకు వరంగల్ సమీపంలో ఘన్ పూర్ వద్ద తొలిసారి ప్రమాదానికి లోనయింది.

ఈ ట్రైను18 స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు (440 మైల్స్) సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిముషాలు

17 భోగీలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు గంటకు 57 కిలో మీటర్లు (35 మైల్ ఫర్ అవర్) తో ప్రయాణిస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో మొదటి ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్ లు మొదలయింది ఈ రైల్లోనే. 2000 సంవత్సరంలో 6 ఎయిర్ కండిషన్డ్ కోచ్ లున్న తొలిరైలుగా గుర్తింపు పొందింది.
2011 ఈ గోదావరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అయింది. ఆయేడాదే రైలు నంబర్ ను 12727 గా మార్చారు. అంతేకాదు, WAP-7 బండి అయింది. WAP-7 అంటే  బ్రాడ్ గేజ్ (w) AC కరెంట్ (A) ప్యాసెంజర్ ట్రాఫిక్ (P) సెవన్గ్ జనరేషన్ ట్రెయిన్ .

ఈ 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలు అందించిన ఘనత సాధించిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు.

ఈ రోజు సాయంత్రం గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు కు   దక్షిణ మధ్య రైల్వే శాఖ వేడుకలు జరుపనుంది.


Tags:    

Similar News