పౌరసత్వం కేంద్రం ఇస్తుంది.. రాష్ట్రాలు కాదు.. షా

ఒక వ్యక్తికి పౌరసత్వాన్ని ఇచ్చేది కేంద్రమేనని, రాష్ట్రాలు కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Update: 2024-03-14 12:14 GMT

పౌరసత్వం కేంద్రానికి సంబంధించిన అంశమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేయమని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్న నేపథ్యంలో షా ఇలా ఉన్నారు.. ‘‘పౌరసత్వం కేంద్రానికి సంబంధించిన అంశం. సీఏఏను ఏ రాష్ట్రం అడ్డుకోలేదు. పౌరసత్వాన్ని ఇచ్చే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.

కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో CAAని అమలు చేయబోమని ఎలా చెప్పాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించడానికి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం పార్లమెంటుకు అన్ని అధికారాలు ఉన్నాయని షా చెప్పారు.

‘‘పౌరసత్వం కేంద్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రానికి సంబంధించినది కాదు. ఎన్నికల తర్వాత అందరూ సహకరిస్తారు. బుజ్జగింపు రాజకీయాల కోసం సీఏఏను దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని హోంమంత్రి అన్నారు.

బెంగాల్‌లో చొరబాట్లను ఆపండి..

పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే ముందు “ఒకసారి ఆలోచించండి” అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను హెచ్చరించడంపై షా స్పందిస్తూ.. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి త్వరలో అధికారంలోకి వస్తుందని, అప్పుడు చొరబాట్లను నిరోధిస్తుందని చెప్పారు.

జాతీయ భద్రతకు సంబంధించిన అంశాన్ని మమత రాజకీయం చేస్తున్నారని షా విమర్శించారు. శరణార్థులు పౌరసత్వం పొందకుండా ఆమె అడ్డుపడుతుందన్నారు. శరణార్థి, చొరబాటుదారుడి మధ్య వ్యత్యాసం గురించి మమతకు అవగాహన లేదన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు..

శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల దొంగతనాలు, అత్యాచారాలు పెరుగుతాయని కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై షా స్పందిస్తూ తన అవినీతిని బయటపెట్టిన తర్వాత కేజ్రీవాల్ శాంతించారని చెప్పారు. ఇప్పటికే చాలామంది భారత్‌కు వచ్చి నివసిస్తున్నారన్న విషయం కేజ్రీవాల్‌కు తెలియదని షా విమర్శించారు. కేజ్రీవాల్ కు అంత ఆందోళనగా ఉంటే..బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి ఎందుకు మాట్లాడరు? లేదా రోహింగ్యాలను ఎందుకు వ్యతిరేకించడు?" అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఓటు బ్యాంకు రాజకీయాలు మాని ఆయన శరణార్థుల కుటుంబాలను కలుసుకోవాలని, విభజన నేపథ్యాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. CAA పట్ల మైనారిటీలు లేదా మరే ఇతర వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదని షా హామీ ఇచ్చారు.   

Tags:    

Similar News