మౌలిక సదుపాయాల లోపాల వల్లే విమానయాన ప్రమాదాల?

జనవాసాల్లోకి చొచ్చుకెళ్లిన రన్ వేలు, ఎత్తైన భవనాలతో పెరుగుతున్న ప్రమాద తీవ్రత;

Update: 2025-06-15 07:21 GMT
విమానయాన ప్రయాణీకులు

రంజిత్ భూషణ్

అహ్మాదాబాద్ లోని సర్ధార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులతో కూడిన విమానం కూలిపోయిన తరువాత అనేక భద్రతా లోపాలు వెలుగులోకి వస్తున్నాయి.

ముఖ్యంగా రన్ వే ఎండ్ ప్రాంతం శిథిలాలు, ఎత్తువంపులతో, ఒపెన్ డ్రెయిన్ లతో ఉందని వీటిని సవరించాలని పలు భద్రతా సంస్థలు హెచ్చరించాయి.

విమాన ప్రమాదం పై భద్రతా సంస్థలు విచారణ చేస్తుండగా, భారతీయ విమానాశ్రయాల్లో భద్రతా పరిస్థితులపై కూడా నివేదికలు బయటకు వస్తున్నాయి.
విమానాశ్రాయాల అభివృద్దిలో ముఖ్యంగా ప్రాంతీయ కనెక్టివిటీలో భారత్ అపూర్వమైన పురోగతి సాధించినప్పటికీ, ప్రస్తుతం భారీ మౌలిక సదుపాయాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి.
కొన్ని భారతీయ విమానాశ్రయాలు గణనీయమైన మౌలిక సదుపాయాల సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నిపుణులు అంగీకరిస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి తగినంత సామర్థ్యం లేకపోవడం, ఆలస్యం, రద్దీకి దారితీసే పరిస్థితులు, భవన నిర్మాణ, నిర్వహణలో లోపాలు ఇవన్నీ కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి.
తీవ్ర నిర్లక్ష్యం..
అహ్మదాబాద్ లో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం దురదృష్టం కాదు. ఇది తీవ్ర నిర్లక్ష్యం వల్లే సంభవించిందని చెప్పాలి. సర్థార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇరుకైనదని నిపుణులు చెబుతున్నారు.
దాని రన్ వే జనసాంద్రత కలిగిన పరిసరాల్లోకి చొచ్చుకుపోయి ఉంది. ఇక్కడ బఫర్ జోన్లు లేవు. అలాగే రెగ్యూలర్ అరెస్టర్ వ్యవస్థ అందుబాటులో లేదు. ఈ వారం బోయింగ్ ఏఐ171 డ్రీమ్ లైనర్ బీజే మెడికల్ కాలేజ్ క్వార్టర్ లోకి చొచ్చుకుపోయి కూలిపోయింది. విమానాశ్రయానికి, నివాస సముదాయాల మధ్య ఎటువంటి రక్షణ జోన్ లేదని ఇది హైలైట్ చేసింది.
ఇక్కడ నెలకొన్ని అనేక భద్రత లోపాలను 2019 లోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హైలైట్ చేసింది. 2018 లో భారత విమానాశ్రయాల అథారిటీ విమానాశ్రయాన్ని విస్తరించడానికి 29 ఎకరాల స్థలం కావాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
దీనికి అధికారిక ఆమోదం వచ్చింది కానీ దాదాపు 300 కుటుంబాలను తొలగించాల్సి వచ్చింది. ఇది రాజకీయంగా తీవ్రంగా ఇబ్బందులు ముందుకు తేచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యం కాలేదు.
రద్దీని తగ్గించడానికి, ఇతర ప్రాంతాలకు విమానాశ్రయాన్ని తరలించడానికి ముందుకు తెచ్చిన ప్రణాళికలన్నీ కాలక్రమంలో విఫలమయ్యాయి. రద్దీని నియంత్రించడానకి కొత్తగా ధోలేరా విమానాశ్రయం 2025 లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అది ఇప్పటికి ముందుకు సాగడం లేదు. ఈ రాష్ట్రానికి చెందిన నాయకులే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
భద్రతలో రాజీపడటం..
ముంబై విమానాశ్రాయాన్ని ప్రతి సంవత్సరం 50 మిలియన్ల ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కూడా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
ఉదాహారణకు రన్ వే విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఇక్కడ ఉన్నవారిని మానవీయ పునరావాసం కల్పించాలి. ఇవన్నీ బాగా ఖర్చుతో కూడుకుని ఉన్నది. అందరూ కలిసి సరిగా పనిచేసినప్పుడే ఇవి ముందుకు సాగుతాయి.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) లో మాజీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్ సేప్టీ ఆఫీసర్ అయిన మంగళ, ముంబై విమానాశ్రయంలో భద్రతా ఉల్లంఘనలు జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భవనాల ఎత్తు నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేని విజిల్ బ్లోయర్ గా మారారు.
బాంబే హైకోర్టు లో పిల్ దాఖలు చేయడంతో న్యాయస్థానం జోక్యం చేసుకుంది. అంతకుముందు తను సర్వీస్ లో ఉండగా సేకరించిన వివరాలు మొత్తం కోర్టు దృష్టికి తెచ్చారు.
వైమానిక ప్రాంతం ఆక్రమణ..
‘‘విమానాశ్రయం చుట్టూ ఉన్న భారీ భవనాలు వైమానిక స్థలాన్ని మొత్తం ఆక్రమించడం, భారతీయ విమానాశ్రయాలలో క్యాన్సర్ లాంటింది. ఇది ముంబైలో విమానయాన భద్రతను తీవ్ర పరిమితులను తీసుకువచ్చింది.
విమానయాన భద్రతలో రాజీపడటంతో(ఎంఐఏపీఎల్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రయివేట్ లిమిటెడ్), ఏఏఐ, డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల ప్రమేయం ఉంది.
ఈ నివేదికలో సిఫార్సు చేయబడిన ఉపశమన చర్యలు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పర్యవేక్షణలో చేపట్టాలని నేను సిఫార్సు చేస్తున్నాను’’ అని ఆమె రచించిన విమానయాన భద్రత నివేదిక పేర్కొంది.
‘‘ఏదైన సంఘటన జరిగినప్పుడూ వాయు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడానికి అధికారులు ఇష్టపడకపోవడం విపత్తుగా ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికులు, సిబ్బందిని కలిపితే కలిగే నష్టాల కంటే భూమిపై మరణించిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది’’ అని ఆ నివేదిక పేర్కొంది.
వాటిలో కొన్ని అహ్మాదాబాద్ లోని నేలపై వైద్యుల మరణంతో రీ సౌండ్ చేశాయి. రాజకీయ ప్రయోజనాల రక్షణలో ఆక్రమణదారులు, అక్రమ స్థిర నివాసులు విమానంలో ప్రయాణించాలని ఎప్పుడూ ఆశించకపోవచ్చు. కానీ లెక్కలేనన్నీ ప్రాణాకు ముప్పు కలిగిస్తూ బయటకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారు.
మౌలిక సదుపాయాలు..
జూన్ 2024 లో భారీ వర్షాల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 వద్ద పై కప్పు కూలిపోయింది. ఈ కారణంగా ఒకరు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాశ్రయాల్లో ఇవి సాధారణంగా జరుగుతున్నాయి.
ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నిర్మాణం, ఉపయోగించిన పదార్థాల గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. విమానాశ్రయ మౌలిక సదుపాయాల నిర్వహణ గురించి ప్రశ్నలు తలెత్తున్నాయి.
గత ఏడాది మే నెలలో బెంగళూర్ లో భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా తీవ్ర జల దిగ్భంధం ఏర్పడింది. విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.
సాధారణంగా బెంగళూర్ విమానాశ్రయం లేదా బీఎల్ ఆర్ విమానాశ్రయం అని పిలువబడే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరదల్లో మునిగిపోవడంతో కనీసం 17 విమానాలను చెన్నైకి మళ్లించారు.
మార్చి ప్రారంభంలో భారీ వర్షాల సమయంలో గౌహతిలోని లోక్ ప్రియ గోపినాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైకప్పు కూలిపోయింది. దీనివలన నీరు లోపలికి ప్రవహించి విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. డిసెంబర్ 2023 లో మిచాంగ్ తుఫాన్ కారణంగా చెన్నై విమానాశ్రయం మొత్తం నీటితో నిండిపోయింది. జూలై 2023 లో అహ్మాదాబాద్ లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అనేక మంది ప్రయాణీకులు మోకాలి లోతు వరకూ నీరు చేరిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రపంచ విమానయాన శక్తి..
ప్రపంచ విమానయాన శక్తిగా భారత్ నిలబడాలంటే ఇలాంటి లోపాలన్ని సవరించాలి. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం... భారత పౌర విమానయాన రంగం అద్భుతమైన వృద్దిని కనపరిచింది.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పరిశ్రమలో ఇది ఒకటిగా అవతరించింది. అమెరికా, చైనా తరువాత ప్రపంచంలో మూడో అతిపెద్ద దేవీయ విమానయాన మార్కెట్ గా భారత ఉంది. ఏటా 16 బిలియన్ డాలర్ల మార్కెట్ పరిణామంతో భారత్ ప్రస్తుతం పదవ అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్ గా ఉంది.
జూన్ 14న ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ప్రచురించిన నివేదిక ప్రకారం.. డీజీసీఏ చివరిసారిగా ఆడిట్ నిర్వహించినప్పుడూ భారత్ దాని కార్యకలాపాలు, వాయు యోగ్యత పరంగా ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉంది.2018 లో 69.95 శాతం నుంచి 85.65 శాతానికి పెరిగింది. ఇది విమానయాన భద్రతా ర్యాంకింగ్ లో మెరుగుదలను సూచిస్తుంది.
భద్రత తగ్గింపు..
గతంలో భారత్ కు హెచ్చరికలు కూడా వచ్చాయి. జనవరి 2014 లో డీజీసీఏ గణనీయమైన భద్రతా పర్యవేక్షణలను పేర్కొంటూ యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భారత్ పౌర విమానయాన భద్రతా రేటింగ్ ను కేటగిరి 2 కి తగ్గించింది.
ఈ తగ్గింపు అంటే భారతీయ విమానయాన సంస్థలు యూఎస్ లో విస్తరించడంపై ఆంక్షలు ఎదుర్కొన్నాయి. ఇప్పటికే ఉన్న మార్గాలపై అదనపు తనిఖీలు ఎదుర్కొన్నాయి. 2013 లో నిర్వహించిన రెండు ఆడిట్ ల ఫలితాల ఆధారంగానే ఎఫ్ఏఏ నిర్ణయం తీసుకోబడింది. ఇది భారత్ విమానయాన భద్రతా పర్యవేక్షణలో లోపాలను, డీజీసీఏ మౌలిక సదుపాయాలను, మానవ శక్తి కొరతను హైలైట్ చేసింది.
ఈ డౌన్ గ్రేడ్ భారత్ ను నికరాగ్వా, సెర్భియా, ఘనా వంటి దేశాలతో సమానంగా చేర్చింది. ఇది అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైందని సూచిస్తుంది.
ఫలితంగా భారతీయ విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ వంటి వాటికి అమెరికా కు నడిపే విమాన సర్వీసులు పెంచకుండా నిషేధించబడ్డాయి. ఉన్న వాటికి అమెరికాలో తనిఖీలు పెరిగాయి.
అమెరికా విమానయాన సంస్థలతో కోడ్ షేరింగ్ ఒప్పందాలను భారతీయ క్యారియర్లు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఎఫ్ఏఏ సూచించింది.
ఈ డౌన్ గ్రేడ్ భారత ప్రభుత్వం ఎఫ్ఏఏ లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించేలా చేసింది. విమానాశ్రయాల్లో లెవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి డీజీసీఏ కట్టుబడి ఉంది.
భారత్ దిద్దుబాటు చర్యలు తీసుకున్న తరువాత యూఎస్, ఎఫ్ఏఏ చివరికి ఏప్రిల్ 2015 లో భారత విమానయాన భద్రతా ర్యాంకింగ్ ను తిరిగి కేటగిరి 1కి అప్ గ్రేడ్ చేసింది.
ఎయిర్ ఇండియా ప్రమాదం పై దర్యాప్తు..
అహ్మాదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తును ఎయిర్ క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వేస్టిగేషన్ బ్యూరో చేపడుతోంది. ఐసీఏఓ నిర్దేశించిన ప్రోటోకాల్ ల ప్రకారం దర్యాప్తు జరగాలి.
కూలిపోయిన విమానం అమెరికా కు చెందిన బోయింగ్ కు చెందినది. ఈ ప్రక్రియను యూఎస్ జాతీయ రవాణా భద్రతా బోర్డు సహాయం చేస్తుంది. విమానంలో బ్రిటిష్ పౌరులు ఉండటం వలన యూకే విమాన ప్రమాదాల దర్యాప్తు శాఖ భద్రతా అధికారులు కూడా రావచ్చు.
ఈ ప్రమాదాన్ని జాతీయ ఏజెన్సీతో పాటు బోయింగ్ విమాన ఇంజిన్ తయారీదారు జీఈ కూడా దర్యాప్తులో సహాయం చేయాలని, ఐసీఏం ప్రోటోకాల్ ప్రకారం విమానం గురించి సమాచారాన్ని అందించాలని భావిస్తున్నారు. మనం ఊహించినంత మాత్రనా , ఈ బహుళ సంస్థ ఆధారిత పరిశోధనలు ఆశ్చర్యకరమైన ముగింపులను ఇవ్వవచ్చు.
( ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను ప్రచురిస్తుంది. వ్యాసంలో సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Tags:    

Similar News