శాంతి చర్చలకు ఉక్రెయిన్ సవాల్ విసిరిందా?
రష్యాపై తాజాగా జరిగిన భారీ డ్రోన్ దాడి కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆటంకమా?;
By : KS Dakshina Murthy
Update: 2025-06-03 12:12 GMT
రష్యా- ఉక్రెయిన్ మధ్య గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్దం, ఇప్పట్లో విరమించే సూచనలు కనుచూపు మేరలో కనపడట్లేదు. మాస్కోపై కీవ్ జరిపిన భారీ డ్రోన్ దాడిలో కాల్పుల విరమణకు ఉన్న చిన్న అవకాశం కూడా పోయింది.
ఇన్నాళ్లు జరిగిన యుద్ధంలో రష్యా పై చేయి సాధించినట్లు కనిపించింది. ఈ సమయంలోనే ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇది వ్లాదిమిర్ పుతిన్ చాలా అవమానకర విషయం. విజేతగా తన నిర్ణయాలను జెలెన్ స్కీ మీద రుద్దాలని పుతిన్ అనుకున్న కలలకు ఇది ఆటంకం కలిగించే పరిణామం.
ఎఫ్పీవీ(FPV- ఫస్ట్ పర్సన్ వ్యూ) డ్రోన్ లను ఉపయోగించి ఈ దాడి జరిగింది. ఇది చాలా అద్బుతమైనది. ఆధునాతన టీయూ- 95, టీయూ -22 వ్యూహాత్మక బాంబర్ లతో సహ కనీసం 40 రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి.
డ్రోన్ లు ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, రియాజాన్, అముర్ ప్రాంతాలలతో సహ దేశంలో ఐదు ప్రధాన నగరాలో ఉన్న వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. ఆపరేషన్ ‘స్పెడర్ వెబ్’ అనే కోడ్ పేరుతో ఈ దాడి కోసం 18 నెలలుగా ప్రణాళిక రచించారని సమాచారం. ఉక్రెయిన్ కేవలం పుష్ ఓవర్ కాదని, పరిగణలోకి తీసుకునే శక్తి అని నిరూపించడానికి ఈ తరహ దాడులకు పూనుకుంది.
కాల్పుల విరమణ దారెటూ..
ఉక్రెయిన్ కు రష్యాపై చేసిన దాడి కీలకమైనది. ఎందుకంటే టర్కీలోని ఇస్తాంబుల్ లో మొదటి రౌండ్ చర్చల్లో శాంతి ఒప్పందం కాస్త పురోగమిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
కానీ ఆదివారం జరిగిన దాడి పుతిన్ ను మనసు మార్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ కు తన స్థానాన్ని నిలబెట్టుకునే శక్తి ఉందని తాజా దాడితో నిరూపించుకుంది. అంటే ఇద్దరం సమానమే. ఇద్దరం కలిసే కాల్పుల విరమణకు అంగీకరించాము అనే సందేశం వస్తుంది.
ఇవి కాల్పుల విరమణ ప్రతిపాదనను క్లిష్టతరం చేస్తాయి. ఇప్పుడు పుతిన్ కచ్చితంగా ప్రతీకార దాడులు చేస్తారు. ఫిబ్రవరి 24, 2024న ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగడం ద్వారా దీర్ఘకాలిక యుద్దానికి దిగిన వ్యక్తి పుతిన్. అలాంటిది ఇప్పుడు జరిగిన డ్రోన్ దాడి ఆయనకు వ్యక్తిగతంగా అవమానం లాంటిది.
రష్యా రాజీపడకుండా ఉంటుందా?
ఇస్తాంబుల్ లో జరిగే చర్చలు పెద్దగా ముందుకు సాగకపోతే అది శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడు చేసే ప్రయత్నాలకు పెద్ద విఘాతం అవుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పుతిన్ వైదోలిగే అవకాశం ఉంది. అలాగే రష్యా తన డిమాండ్లపై రాజీపడే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంలో ఏదో ఒక ఒప్పందం కూడా కుదరవచ్చు.
ఇప్పటి వరకూ రష్యా తన వైఖరిని వెల్లడించలేదు. కానీ తను గతంలో ఆక్రమించిన భూభాగాల నుంచి వైదొలగడానికి మాత్రం ఆయన నిరాకరించారు. వాస్తవానికి ఉక్రెయిన్, రష్యా మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రధాన అడ్డంకి ఏంటంటే.. డాన్ బాస్ ప్రాంతం, క్రిమియా ప్రాంతాన్ని తిరిగి రష్యా వెనక్కి ఇవ్వడం. ఆక్రమిత ప్రాంతం రష్యా- అమెరికా నేతృత్వంలోని పశ్చిమ కూటమికి మధ్య బఫర్ జోన్ గా ఉండాలని పుతిన్ చెబుతున్నారు.
అమెరికాకు ఉక్రెయిన్ సందేశం..
దీర్ఘకాలిక శాంతి ఒప్పందం గురించి మాట్లాడే ముందు ఉక్రెయిన్ తప్పనిసరిగా పూర్తి బేషరతు కాల్పుల విరమణను కోరుకుంటుంది.
ఉక్రెయిన్ కు ఇంకా పోరాడే శక్తి ఉంది అని తాజాగా నిర్వహించిన దాడి తెలియజేస్తోంది. వాస్తవానికి ట్రంప్ ఉక్రెయిన్ ను పూర్తిగా విడిచిపెట్టినప్పటికీ, యూరోపియన్ నాటో మిత్రదేశాలు మాత్రం జెలెన్ స్కీ కి పూర్తి మద్దతును ఇస్తున్నాయి. ఈ దాడి వారి వల్లనే సాధ్యమైంది.
రష్యాపై ఉక్రెయిన్ దాడిని ట్రంప్, తన డిప్యూటీ జేడీ వాన్స్ వైఖరిలో మార్పు తీసుకొచ్చి ఉండవచ్చు. మార్చిలో మీడియా ముందు వీరు జెలెన్ స్కీని తీవ్రంగా అవమానించారు. ఇప్పుడు వీరి అండలేకుండా కీవ్ దాడి చేసింది.
ట్రంప్ తో జరిగిన సమావేశంలో జెలన్ స్కీకి అసలు ఎలాంటి అవకాశం లేదని వారు వ్యాఖ్యానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో కీవ్ తప్పనిసరిగా షరతులకు అంగీకరించాల్సిందే అని ఒత్తిడి తెచ్చారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులోనే ముగిస్తానని ప్రగల్భాలు పలికిన ట్రంప్, తాను అధికారం చేపట్టి వందరోజుల పూర్తయిన ఇప్పటికీ ముందడుగు వేయలేకపోయారు. ఆయన వైఖరిలో స్పష్టమైన నిరుత్సాహం చోటు చేసుకుంది. అమెరికా మద్దతు లేకపోయినా ఉక్రెయిన్ ఏం చేయగలదో చేసి చూపించింది.
ఇది ట్రంప్ కే నిజమైన సవాల్ వంటిది. ఎవరూ ఊహించని ఉక్రెయిన్ సాహసోపేతమైన ప్రదర్శనకు ట్రంప్ పరిపాలన ఎలా స్పందిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.
పుతిన్ ఆగ్రహం..
ట్రంప్ తమను పక్కన పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన నాటో మిత్రదేశాలు జెలన్ స్కీ కి మద్దతు ఇచ్చి నిశ్శబ్ధంగా తమ పనిని కానిచ్చాయి. ఉక్రెయిన్ దాడుల విషయాన్ని ఇప్పుడు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
రష్యా భూభాగంలోని సుదూర లక్ష్యాలను ఉక్రెయిన్ ఎంచుకుని దాడులు చేయడంతో ఇప్పుడు మాస్కో కూడా ప్రతిదాడులు చేయాల్సిన అవసరాన్ని కల్పించింది. ఇప్పుడు అది కోపంతో పోరాడవలసి ఉంటుంది.
గత మూడు సంవత్సరాల నుంచి అది దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ప్రత్యేకంగా తూర్పు భూభాగంలోకి ప్రవేశించి ఆక్రమించింది. అమెరికా, దాని మిత్రదేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చినప్పటికీ దాని కీలక నగరాల్లోని మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది.
దాదాపు ఒక లక్ష మంది సైనికులను కోల్పోయింది. జెలెన్ స్కీ మాత్రం 50 వేల మంది మరణించారని ధృవీకరించారు. సుమారు మూడు మిలియన్ల మంది ఉక్రెనియన్లు నిరాశ్రయులయ్యారని, ఆరు మిలియన్ల మంది దేశం నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది.
అలాగే పుతిన్ దళాలు కూడా నష్టాలను చవి చూశాయి. అయితే నగరాల మౌలిక సదుపాయాలకు పెద్దగా నష్టం కలగలేదు. 2024 మాత్రం దానికి భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ యుద్దంలో దాదాపు 45 వేల మంది మరణించారు.
ఉక్రెయిన్ తాజా దాడులతో రష్యా తన అత్యాధునిక సైనిక పరికరాలకు భారీగా కోల్పోయింది. ఇది గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం కూడా ఉంది. ఇది యుద్దాన్ని ముగింపు దిశగా తీసుకెళ్తుందా లేదా మంట మరింత రాజుకుంటుందా అనేదే ఇక్కడ కీలకమైన ప్రశ్న.