నేటి తెలంగాణ పల్లెలు మునుపటి పల్లెలు కాదు

జగిత్యాల పాత బస్టాండులో ఉ. 8 గంటల నుండి 11 గం. దాక కేవలం పరిశీలిస్తే చాలు ప్రపంచీకరణ లో ఏం జరుగుతున్నదో తెలుస్తుంది.;

Update: 2025-06-30 04:47 GMT
Represenational picgure. source: goodtextiles

తెలంగాణ పల్లె మారుతున్నది. సిటీ పెరుగుతున్నది. పల్లె జనాభా తగ్గుతున్నది. పల్లెనుండి నగరాలకు విదేశాలకు వలసలు పెరుగుతున్నాయి. నగరీకరణ , కేంద్రీకృత అభివృద్ది విస్తరిస్తున్నది. ప్రపంచీకరణ ప్రారంభమైన 1991 నుండి 35 ఏండ్లు గడిచాయి. ఆనాటికి ఐదేండ్లు దాటిన పిల్లలు అనగా 1986 నుండి పుట్టిన పిల్లలు వెనకటిలా తల్డ్లి దండ్రుల అదుపు ఆజ్ఞలలో పెరుగుతున్న పిల్లలు కాదు. వారిని ప్రపంచీకరణ నడిపిస్తున్నది. వారి ప్రేమలు పెళ్లిల్లు స్నేహాలు అభిరుచులు , అవకాశాలు వేరు. వారి లోకం వేరు.

ప్రపంచీకరణతో ప్రపంచం ఒక కుగ్రామమైంది అంటుంటారు గానీ దాని పూర్తి అర్థం ఎవరికీ అంతు తెలిసినట్టు లేదు. అందుకే పల్లెలు ఇట్లా ఎందుకున్నాయో అర్థం చేసుకోలేక పోతున్నారు. మానవ సంబంధాలు, స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు ఎలా మలుపు తిరుగుతున్నాయో అంచనా వేయలేకపోతున్నారు. రెండు ఎడ్లు ప్రధాన పాత్రలుగా అక్కినేని నాగేశ్వర రావు నటించిన @నమ్మిన బంటు " వంటి సినిమాలు , ఆనాటి గ్రామీణ జీవితం, పేదలు, పేదల కష్టాలు చిత్రించిన సినిమాలు, కథలు నవలలు ఈనాడు ఎందుకు రావడం లేదో అర్థం చేసుకోలేక పోతున్నారు. ప్రపంచీకరణ ఎవరికైనా అర్థం కాకపోతే 11 సెప్టెంబర్ 2001 అమెరికాలోని ట్విన్ టవర్సు కూల్చివేత తర్వాతైనా కళ్లు తెరిచి వుంటారు.
జగిత్యాల పాత బస్టాండులో ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల దాక కేవలం మూడు గంటలు పరిశీలిస్తే చాలు ప్రపంచీకరణ లో ఏం జరుగుతున్నదో తెలుస్తుంది. ఆ సమయం నుండి పల్లెలకు సిటీకి గల రాక పోకలు అనుబంధాలు , బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు , కోర్టులు . కంప్యూటర్ సెంటర్లు , మీ సేవా కేంద్రాలు కిట కిట లాడుతుంటాయి.
గ్రామీణ జీవితం మునుపటిలా లేదు. ఉండాలనుకోవడం నేరం. గ్రామీణ జీవితం లో వ్యయసాయం కుల వృత్తులు కొన్ని కొన సాగుతున్నప్పటికీ సంస్కృతిని నిర్మించే కళలు సాహిత్యం డిష్ కనెక్షన్లు , యూట్యూబ్, టీవీ సీరియల్ లు వార్తా చానల్లు, వెకిలి హాస్య ప్రదర్శనలు టైమున్నవాల్లు చూడడానకి రోజుకు అన్ని చానల్లలో కలిపి 20 సినిమాలు , సీరియల్లు , మనిషికి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా టీవీ సీరియల్లు, నిరంతర వార్తా ప్రసారాలు, , రాజకీయ పరస్పర ఆరోపణలు , హత్యలు అక్రమ సంబంధాలు, మాన భంగాలు, వంటలు అలంకరణలు , ఫ్యాషన్లు, ప్రచారమవుతున్నాయి.
నేడు నగరాల్లోనే దూరం ఎక్కువ. ఈ కొస నుండి ఆ కొసకు 40,కిలో మీటర్ల దూరం. రెండుగంటల ప్రయాణం. పల్లెలకు ఈ ప్రయాణ కాలంతోపాటు దూరం కూడా చాలా తగ్గింది. పల్లెకు జిల్లా కేంద్రానికి దూరం తక్కువైంది. రోడ్లు బాగయ్యాయి. బస్సులు బైకులు, ఆటోలు పుష్కలం. పల్లెల నుండి పాలు , పూలు, కూరగాయలు , ధాన్యం పండ్లు ఫలాలతోపాటు పొద్దున్నే బడి పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఆధునిక హంగులున్న సమీప సిటీల బాట పడుతున్నారు. సినిమా టాకీసులు నాలుగు షోలు నడుస్తున్నాయి. బ్యాంకు పనుల మీద, ఆన్ లైన్ లో దరఖాస్తులు నింపడానికి, తహసీల్ ఆఫీసు, కరెంటు ఆఫీసు ,
రిజిస్ట్రేషన్ ఆఫీసు పని మీద సమీప సిటీకి రోజు రాకపోకలు పెరిగాయి. నవోదయ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్లో దరఖాస్తులు నింపాలి. అన్నిటికీ ఆధార కార్డు ఆధారం. బీడీ కార్మికులకు వారు చేసిన బీడీలకూలికి తోడుగా నెలకు రెండు వేలు ఆసరా పథకం, వంటరి మహిళలకు వృద్దులకు 2 వేలు ఆసరా పథకం, ఉచిత బియ్యం, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, వ్యవసాయానికి ఎకరానికి ఐదువేలు ఉచిత సాయం, బావులకు కరెంటు ఉచితం, గల్ఫ్ దేశాలకు వెళ్నిన వారు పంపే డబ్బులు, ఆటోలు,ట్రాక్టర్లు, జెసిబీలు, కార్లు ,ట్రాలీ సరుకు రవాణా వాహనాలు, బోర్లు వేయడం, రక్షిత మంచి నీరు, మద్యానికి బెల్టు షాపులలో ఫారెన్ సరుకులు ( ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్) , రవాణ సౌక్యాలు పెరగడంతో డిమార్టు షాపుల్లో సరుకులు కొనుక్కొని వెళ్లడం , పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం, కాలేజీ చదువులకు రోజూ పోయి రావడం, ప్రయివేట్ ఇంగ్లీషు మీడియం చదులకు స్కూల్ బస్సులో పోయి రావడం, డ్యూటీ మీద సిటీ నుండి టీచరమ్మలు , టీచర్లు పల్లెకు, పల్లె నుండి సిటికి మనుషులు ట్రిప్పులు కొట్టడం...డాబా ఇండ్లు పెరగడం.. భూముల ధరలు ఆకాశాన్ని అంటడం.. ఆర్భాటంగా పెండ్లిల్లు...
ఇవన్నీ నగరాలకు అర్బన్ , సెమీ అర్బన్ కాలనీలా పల్లెలు మారాయి. పల్లెల్లో వెనకటి పేదరికం లేదు. మద్యం కంట్లోల్ చేస్తే జీవన ప్రమాణాలు 30 శాతం పెరుగుతాయి. ప్రతి ఊరిలో స్థానికులో ఇతరులో హోటల్లు... పూరి , దోశ, ఉప్మా, వడ, 30 రూపాయలకే ప్లేటు, తడి అటుకులు, బజ్జీలు మిర్చీలు, స్వీట్లు , రెండు కిలోమీటర్ల లోపే లభించడం.. ఫోన్ పే మొదలైన సౌకర్యాలు పెరిగాయి.
భారీ సెట్టింగులు కమనీయ ప్రకృతి దృశ్యాలు , భారీ తారాణం సినిమాలు చూడడం ద్వారా నగరాలు, నాగరికతలు, క్లబ్ డ్యాన్సులు ప్రేమలు, క్రైం సాంఘిక చారిత్రక సినిమాలు చూసి బొంబాయి కార్మికులు కాసేపు హాయిగా సేద తీరే వారు. అలాంటి సంస్కృతి చూడాలని వాటిని ఆదరించడం పెరిగింది. సాహిత్యంలో కూడ వాటినే ఆదరించారు.
మత పరంగా మతతత్వ భావజాలంలో కూరుకు పోయి పండుగలకు, ద్వేషాలకు కొదవ లేకుండా పోయినప్పకీ జీవన విధానం ఆధునికతో కొనసాగుతున్నది. మహిళల అలంకరణలు దుస్తులు సిటీ లను టీవీలను అనుకరించి విస్తరిస్తున్నాయి.
పల్లెల్లో ఒక్క వ్యవసాయంలో నెమ్మది ఎక్కువ. పంట పండేదాక ఎదిరి చూడ వలసినదే. ధాన్యం ఆహర పంటలు వాణిజ్య పంటలు మొదలైన వాటి కోసం అవికాపుకు వచ్చేదా ఎదిరి చూడాల్సిందే. కూరగాయలు పూలు పండ్లు వెంట వెంట తెంపి అమ్మాల్సిందే. తాటి, ఈత కల్లు పాలు, పేడ వెంట వెంట తీయాల్సిందే. మగతా రంగాలలో వేగం పెరిగిన జీవితమే కొనసాగుతున్నది. ఇలా వ్యసాయం, పశువులు మేకలు గొర్రెలు ఉన్నవారి జీవితంలో నెమ్మది తనం కనపడుతుంది. పశువులకు పొద్గు గూకాలి. వ్యవసాయానికి నెలలు తరబడి పంటకై ఎదిరి చూడాలి. వెనకటి యాతాలు లేవు. మోటలు లేవు. రాటు బొక్కెనలు లేవు. స్విచ్ వేస్తే నీళ్లు పారుతాయి. లేదా చెరువునీరు కాలువ నీరు పారకం సాగుతుంది. వ్యవసాయ కూలీల వేగంతోపాటు జీవితంలో వలసలు పెరిగాయి. సగటున ఊరి జనాభాలో పని చేయగలిగే వారు సగానికి పైగా వలసలు పోతున్నారు. సమీపంలోని పెద్ద వూరు మొదలుకొని హైదరాబాద్ ముంబయి భీవండి, గల్ఫ్ దాకా లక్షలాది మంది వలసలు పోతున్నారు. ఉత్పత్తి రంగంలో ఉపాధి లేక పట్టణాల్లో ఇళ్లల్లో పని మనుషులుగా, ఆటో డ్రయివర్లుగా సర్వీస్ సేవా రంగాల్లో జీవనం వెతుక్కుంటున్నారు.
స్థానికంగా జిల్లా పరిధిలో ఉపాధి లభించే పరిశ్రమలు లేక పోవడం వల్ల దూర తీరాలకు వలస సాగుతున్నది అందువల్ల పల్లెలు నెనకటి పల్లెలు కావు.
సినిమాల్లో సాహిత్యం ఇపుడు పేదల కష్టాలు చూపితే మల్లా అవేనా అని ప్రజలు చూడడం లేదు. మిగతా వారు వాటిని ఆనందం కోసం చూస్తారు. ప్రపంచీకరణ జీవితాన్ని ఎంజాయ్ చేయడం నేర్పింది. చివరకు చావును కూడా ఎంజాయ్ చేస్తున్నారు. యుద్ద వార్తలు దృశ్యాలు తూసి స్పందించే స్వభావం పోయి క్రికెట్ లా చూసి ఎందాయ్ చేసేవస్థితిలపెరిగింది. తన దాకా వస్తే గాని పట్టింకోని తత్వం పెరిగి వ్యక్తి స్వీయ కేంద్రంగా ఆలోచిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ దృష్టి సన్నగిల్లుతున్నది. దాంతో మద్యపానం, చెడు అలవాట్లు వృధావ్యయం పెరుగుతున్నది. వలసలు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి.
పాత మానవ సంధాలను జానపద యూట్యూబ్ పాటల్లో నాటికల్లో కోట్లాది మంది తూస్తున్నారు. అవి కూడా ఎంజాయ్ చేయడానికే తప్ప కరుణ రసంతో ఇతరుల పట్ల సమాజం పట్ల స్పందించడం కోసం కాదు.
ఇలా పల్లెల్లో కూడ మానవ స్వభావం నగర నాగరికతకు సంస్కృతికి చేరువుతున్నది. ఐదు ఎకరాల భూమి ( రెండు వందల గుంటలు) అమ్మి నగరాల్లో రెండు గుంటల భూమి ఇల్లు అపార్టు మెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కనపడుతున్న అభివృద్దిని అందినకాడికి ఏదో విధంగా అనుభవించాలి., సొంతం చేసుకోవాలి అనే దృష్టి పెరుగుతున్నది. వలసలతో పల్లెలు ఎండిపోయి పాత ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. పార్టీలు,
రాజకీయ వైరుధ్యాలు కూడా పెరుగుతున్నాయి. ఇలా పల్లెలు ప్రపంచీకరణలో "ఆధునికం" అవుతున్నాయి. తదువుకున్నవారు పెరుగుతున్నారు. గిట్టుబాటులేక గౌరవం లేక కుల వృత్తులు నిరాకరిస్తున్నారు. . ఆధునికతవైపు పరుగులు తీస్తున్నారు.
నగర జనాభా పెరుగుతున్నది. పల్లె జనాభా తగ్గుతున్నది. వికేంద్రీకృత అభివృద్ది నమూనాతో మండల, జిల్లా , నియోజక వర్గం ఫ్రాతిపదిక గా ప్రణాళికల అభివృద్ది సాగినపుడు జీవన వ్యయం తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.


Tags:    

Similar News