ఒడిషాకు వికే పాండియన్ భారీ దెబ్బ, నవీన్ రాజకీయ జీవితం..

ఒడిషా లో భారీ రాజకీయ తుఫాన్ సంభవించింది. ఈ తుఫాన్ లో బీజేడీ నౌక భారీగా దెబ్బతింది. ఈ నౌకకు రెస్క్యూ అందడం ఇక కష్టమే..

Update: 2024-06-04 12:36 GMT

ఒడిశా కాలానుగుణంగా సంభవించే తుఫానులకు ప్రసిద్ధి చెందింది, ఉదాహరణకు 1999లో ఒక అతి తీవ్ర తుఫాను 10,000 మందిని పొట్టన పెట్టుకుంది.

ఇప్పుడు జూన్ 4న రాష్ట్రాన్ని తాజాగా మరో తుఫాన్ తాకింది. కాకపోతే అది రాజకీయంగా..ఇది కూడా భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా నవీన్ పట్నాయక్ అనే స్థిరమైన నౌకను, బలవంతంగా బయటకు నెట్టింది. ఈ తుఫాన్ లో పాలక బీజేడీ పార్టీ తీవ్రంగా గాయపడింది. వారికి ఏదైన రెస్క్యూ అందే అవకాశం చాలా తక్కువ. భవిష్యత్ లో కోలుకునే అవకాశం దాదాపుగా శూన్యంగా కనిపిస్తోంది.
ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలోని 147 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేడీ వాటా భారీగా పడిపోయింది.
పట్నాయక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది
పట్నాయక్ - 2000 నుంచి నిరంతరాయంగా ఒడిశా అధికారంలో ఉన్నారు. దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టడం దాదాపుగా అసాధ్యంగా మారింది.
ఇప్పటికే పట్నాయక్ కు  77 ఏళ్ల వయస్సు, ఆరోగ్యం బాగాలేదు. ఆయన మళ్లీ పునరాగమనం చేయడం దాదాపుగా అసాధ్యం. ఒడిషా లోని 21 లోక్ సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. వీటిలో చాలా బీజేడీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. ఇది పట్నాయక్ రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బ.
అతని అరుదైన స్థాయి, రాజకీయ నాయకుడికి, ఇలాంటి ముగింపు ఊహించలేనిది. ప్రజల మనస్సులను చదవడంలో ఎప్పుడు ముందుండే పట్నాయక్, ఈసారి ఘోరంగా విఫలమయ్యారు. తన మాజీ ప్రైవేట్ సెక్రటరీ వీకే పాండియన్ ను ప్రజలపైకి తీసుకురావాలనే నిర్ణయం ఎదురుదెబ్బ తీసింది.
పాండియన్ విషయం..
తమిళనాడులో జన్మించిన IAS అధికారి అయిన పాండియన్ ఎంపికను ఒడియాస్ చాలా అసహ్యించుకున్నారు, ఒడిశాకు చెందిన సహోద్యోగిని వివాహం చేసుకుని మాత్రమే ఒడిశాలో పని చేయడానికి వచ్చాడు. ఆ తరువాత అప్రజాస్వామిక పద్ధతిలో ప్రజలపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నాలు జరిగాయి.
సీనియర్లను పక్కన పెట్టి పాండియన్ పార్టీని హైజాక్ చేశారు. ప్రచారం మొత్తం ఏకపక్షంగా పాండియనే చేశారు. ప్రచార వ్యూహాలు ఆయనే రూపొందించారు. దీనితో ఆయన నాయకత్వంపై విరక్తి కలిగింది. ఒడియా ప్రజల ఆగ్రహాన్ని పసిగట్టిన ప్రతిపక్షం ఒడియా ప్రైడ్ పేరుతో ప్రచారాన్ని ఉధృతం చేసింది.
పాండియన్ పై ఉన్న ప్రజా వ్యతిరేకత, నవీన్ పట్నాయక్ ఉన్న ప్రజాదరణ కూడా సరిపోలేదు. గత రెండు దశాబ్దాలుగా హుందాగా అధికారంలో ఉన్న బీజేడీ ఇప్పుడు అధికారం నుంచి తప్పుకోనుంది.
రాజకీయ ఆత్మహత్య
పట్నాయక్ వంటి అసాధారణ రాజకీయ నాయకుడు జనాదరణ మూడ్‌ను చదవడంలో ఎలా, ఎందుకు విఫలమయ్యారనేది రహస్య ప్రశ్నగా మిగిలిపోయింది.  దీనికో ఒక కారణం ఏమిటంటే, అతని వయస్సు అతనిని చేతులు కట్టివేసిందని చెప్పవచ్చు. పాండియన్ నేతృత్వంలోని బృందం పట్నాయక్ ను బందీగా ఉంచిందని ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రతిపక్ష నాయకులు అందరూ ఆరోపించారు. మెజారిటీ ఒడియాలు దీనిని అంగీకరించినట్లే కనిపిస్తోంది.
కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పట్నాయక్ ఆధ్వర్యంలో పేదరికాన్ని తగ్గించడం, శిశు మరణాలను రేటు తగ్గడం వంటి కొన్ని అంశాలలో ఒడిశా పురోగమించిందనే చెప్పుకోవాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వంటి అనేక అంశాలలో జాతీయ సగటు కంటే వెనుకబడి ఉంది. అలాగే నిరుద్యోగం- ద్రవ్యోల్బణం ఇతర రాష్ట్రాలకు జీవనోపాధి కోసం ఒడియాలు భారీ స్థాయిలో వలసవెళ్లడం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిన అంశాలుగా చెప్పవచ్చు. ఇవన్నీ ఇప్పటికీ కూడా కొనసాగడం దురదృష్టకరం.
అలాగే అపరిష్కృతంగా ఉన్న కొన్ని ముఖ్యమైన సమస్యలు పట్నాయక్ స్థితిని దెబ్బతీశాయి. గతంలో ఆయనను ప్రజలు విశ్వసించారు. కానీ ఇప్పుడు పాండియన్‌ బాధ్యతలు చేపట్టడం వల్ల ప్రజలు ఆయన BJDపై సంప్రదాయంగా ఉంచిన విశ్వాసాన్ని విడిచిపెట్టారు. పట్నాయక్ వృద్ధాప్య నాయకత్వం తక్కువ విశ్వాసాన్ని కూడా ఇచ్చింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న బీజేపీకి సరికొత్త అవకాశం ఇచ్చింది. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అసమ్మతి తుఫానుతో ఎట్టకేలకు పట్నాయక్ పడిపోయారు.
Tags:    

Similar News