ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: ప్రధాని

ఇప్పటికే మూడు సార్లు వాళ్ల ఇంటిలోకి వెళ్లి కొట్టి వచ్చామన్న నరేంద్ర మోదీ;

Update: 2025-05-29 14:02 GMT
ప్రధాని నరేంద్ర మోదీ

ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే వారిపై భారత్ భారీ మూల్యం విధించడం కొనసాగిస్తుందని, ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత బెంగాల్ లో మొదటిసారి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేశారు.

‘‘ఇప్పుడు నేను సిందూర్ ఖేలా( విజయ దశమి చివరి రోజు బెంగాల్ మహిళలు భర్త ఆయురారోగ్యాలు కోరుతూ ఒకరి నుదిటిపై మరొకరు సిందూరం పెట్టుకోవడాన్ని సిందూర్ ఖేలా అంటారు)అనే పవిత్ర గడ్డపై నిలబడి ఉన్నాను.
కాబట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొత్త సంకల్పం ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడటం సరైనదే’’ అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్, బెంగాల్ గౌరవనీయమైన సిందూర్ ఖేలా సంప్రదాయం మధ్య భావోద్వేగ సంబంధాన్ని ఆయన వివరించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ ఈ హింసాత్మక చర్య దేశాన్ని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ను తీవ్రంగా కుదిపేసిందని ప్రధానమంత్రి అన్నారు.
‘‘ఉగ్రవాదులు మన సోదరిమణుల నుదుటి నుంచి సిందూర్ తుడిచివేయడానికి సాహసించారు. కానీ మన ధైర్య సైనికులు ఆ సిందూర్ శక్తిని వారికి గ్రహించేలా చేశారు’’ అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ కు హెచ్చరిక..
ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుందని మరోసారి ప్రధాని పునరుద్ఘాటించారు. మనదేశంపై ఉగ్రవాద దాడి జరిగితే శత్రువు భారీ మూల్యం చెల్లించుకుంటాడు.
మేము మీ ఇంట్లోకి ప్రవేశించి మూడుసార్లు దాడి చేశామని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలని గట్టి హెచ్చరిక జారీ చేశారు.‘‘పాకిస్తాన్ ఊహించని విధంగా మేము ఉగ్రవాద మూలిక సదుపాయాలను నాశనం చేశాము. వారి ఇళ్లలోనే వారిని మూడుసార్లు దాడి చేశాము’’ అన్నారు.
ఆయన మూడుసార్ల అనే విషయంలో వివరాలను పేర్కొనకపోయిన అవి 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడి, ఆపరేషన్ సిందూర్ గురించి ఇటీవల జరిగిన సరిహద్దు దాడులను ఆయన పరోక్షంగా వివరించారు.
భారత్ దృఢ సంకల్పం
‘‘ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తోందని, ఉగ్రవాదం, సామూహిక హత్యలు పాకిస్తాన్ సైన్యానికి ఉన్న అతిపెద్ద నైపుణ్యం. బహిరంగ యుద్దం జరిగినప్పుడు మాత్రం వారు ఓటమిని ఎదుర్కొంటారు’’ అని ప్రధాని అన్నారు. తూర్పు పాకిస్తాన్ లో పాక్ సైన్యం చేసిన దురాగతాలను గుర్తు చేసుకుంటూ, 1971 బంగ్లా విముక్తి యుద్ధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాద వారసత్వాన్ని ప్రస్తావిస్తూ ‘‘ అది ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మాత్రమే పెంచి పోషిస్తోంది. 1947 లో దేశ విభజన జరిగినప్పటి నుంచి భారత్ పై ఉగ్రవాద దాడులను కొనసాగించింది’’ అని ప్రధాని అన్నారు.
సరిహద్దు వెంబడి ఉగ్రవాదులను భారత్ నిరంతరం వెంబడిస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచే దేశమైన పాకిస్తాన్ ప్రపంచానికి సానుకూలంగా ఏమీ అందించలేదు. కానీ భారత్ మారిపోయింది. మేము ఇకపై అలాంటి పిరికితనాన్ని సహించము. ఆపరేషన్ సిందూరే మా దృఢమైన సమాధానం అని మోదీ పేర్కొన్నారు.
టీఎంసీపై విమర్శలు..
టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మమతా ప్రభుత్వం హింస, అవినీతి, అక్రమాలను పెంచి పొషిస్తోందని ప్రధాని అన్నారు. ‘‘నిర్మమ్ సర్కార్’’ (క్రూరమైన ప్రభుత్వం) నుంచి ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ముర్షిదాబాద్, మాల్దాలో జరిగిన మతహింస సంఘటనలు సాధారణ పౌరుల బాధలపట్ల టీఎంసీ ఉదాసీనంగా వ్యవహరించిందని అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్ వరుస సంక్షోభాలతో సతమతమవుతోంది. బెంగాల్ ప్రజలు మార్పు, సుపరిపాలనను కోరుకుంటున్నారు. వారి ఇకపై క్రూరత్వం, అవినీతిని కోరుకోవడం లేదు’’ అని మోదీ అన్నారు.
బెంగాల్ లో ఉన్న ఐదు సంక్షోభాలను ఆయన హైలైట్ చేశారు. విస్తృత హింస, చట్టరాహిత్యం, మహిళల్లో అభద్రత, నిరుద్యోగం కారణంగా యువత నిరాశ, లోతుగా పాతుకుపోయిన అవినీతి, పేదల హక్కులను దోచుకునే స్వార్థపూరిత రాజకీయాలు ఉన్నాయంది.
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది వేలాది మంది ఉపాధ్యాయుల కెరీర్ లను మాత్రమే కాకుండా మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని అన్నారు.
ఇటీవల నీతి ఆయోగ్ సమావేశానికి టీఎంసీ గైర్హాజరు కావడాన్ని కూడా ప్రధాని విమర్శించారు. ఆ పార్టీ అభివృద్ధి కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.
Tags:    

Similar News