అన్న క్యాంటీన్లకు ఆదివారం సెలవు.. సోమవారం నుంచి శనివారం వరకు మెను ఇదే

అన్న క్యాంటీన్ల ద్వారా వారం రోజుల్లో ఒక రోజు మినహాయించి మిగిలిన ఆరు రోజుల పాటు ఆహారాన్ని అందించనున్నారు. మెను కింద ఇచ్చే వెరైటీలు ఇవే.

Update: 2024-08-15 07:35 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్ల ద్వారా అందించేకు ఒక మెనును రూపొందించారు. దాని ప్రకారం సోమవారం నుంచి శనివారం వరకు అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని అందించనున్నారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌ను అందించనున్నారు. రూ. 5లకే వీటిని అందిస్తారు. రూ. 15లతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్‌లను పూర్తి చేసుకోవచ్చు.

Delete Edit
సోమవారం ఉదయం టిఫిన్‌ కింద ఇడ్లీ ఇస్తారు. దానిలోకి చట్నీ, పొడి, సాంబార్‌ ఇస్తారు. ఇడ్లీ వద్దనుకున్న వారికి పూరి, కుర్మా అందిస్తారు. మధ్యాహ్నం లంచ్‌ కింద వైట్‌ రైస్, ఏదైనా ఒక వెరైటీ కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డిస్తారు. రాత్రి డిన్నర్‌ కింద ఇదే తరహాలో ఆహారం అందిస్తారు. మంగళవారం అల్పాహారం కింద ఇడ్లీ ఇస్తారు. దీనికి చట్నీ, పొడి, సాంబార్‌ ఇస్తారు. ఇడ్లీ వద్దనుకున్న వారికి ఉప్మా ఇస్తారు. దీనిలోకి చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్‌ అందిస్తారు. మధ్యాహ్నం లంచ్‌ కింద వైట్‌ రైస్‌ ఇస్తారు. దీనిలోకి ఒక కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి ఇస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు లంచ్, డిన్నర్‌ కింద దాదాపు ఇదే మెనును అమలు చేయనున్నారు. అయితే కూరలు మారుతాయి. ఒక్కో రోజు ఒక్కో వెరైటీ కూరగాయలతో కూడిన కూరను తయారు చేసి అందిస్తారు.
బుధవారం ఉదయం టిఫిన్‌ కోసం ఇడ్లీ లేదా పొంగల్‌ ఉంటుంది. దీనిలోకి చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్‌ ఇస్తారు. గురువారం ఉదయం టిఫిన్‌ కింద ఇడ్లీ లేదా పూరి ఇస్తారు. ఇడ్లీలోకి చట్నీ, పొడి, సాంబార్, ఉప్మాలోకి కుర్మా ఇస్తారు. శుక్రవారం ఇడ్లీ, ఉప్మా ఉంటుంది. శనివారం ఇడ్లీ, పొంగల్‌ ఉంటుంది.
ఇలా సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ ఒక ఐటమ్‌ కింద ఉంటుంది. దీంతో పాటుగా మరొక ఐటమ్‌ ఉంటుంది. ఉప్మా కానీ, పూరి కానీ, పొంగల్‌ కానీ అందిస్తారు. రెండు రోజులు పూరి, రెండు రోజులు ఉప్మా, రెండు రోజులు పొంగల్‌ను అందిస్తారు. ఇడ్లీ కానీ, రెండో ఐటమ్‌ కింద ఏది ఉంటే దానిని రూ. 5లకే అందిస్తారు.
మూడు ఇడ్లీలు, మూడు పూరీలు, ఉప్మా కానీ పొంగల్‌ కానీ 250 గ్రాములు, మధ్యాహ్న లంచ్‌ కింద 400 గ్రాములు రైస్, 15 గ్రాములు చట్నీ లేదా పొడి, 150 గ్రాములు సాంబారు, 25 గ్రాములు మిక్చర్, 100 గ్రాములు కూర, 120 గ్రాములు పప్పు లేదా సాంబార్, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు చొప్పున అందిస్తారు.
టైమింగ్స్‌ ఇవే..
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్‌ సమయాలను కూడా నిర్ణయించారు. ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు టిఫిన్‌ అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12:30 గంటల నుంచే లంచ్‌ అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3గంటల వరకు లంచ్‌ అవెయిలబుల్‌గా ఉంచుతారు. ఇక డిన్నర్‌ రాత్రి 7:30 గంటల నుంచి 9 గంటల వరకు డిన్నర్‌ అందుబాటులో ఉంటుంది.
Tags:    

Similar News