ధర్మస్థల దర్యాప్తు పై స్టే ఎత్తేసిన హైకోర్టు
తప్పుడు ఆరోపణలు చేసిన చిన్నయ్యకు సహకరించిన నలుగురు సామాజిక కార్యకర్తలు
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ధర్మస్థల లో అనేక మంది మహిళలు, బాలికలపై అత్యాచారం, హత్య చేశారని ఆరోపణలు చేసిన అంశంపై ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ పై గతంలో హైకోర్టు విధించిన స్టే ను హైకోర్టు బుధవారం ఎత్తివేసింది.
సామాజిక కార్యకర్తలు గిరిశ్ మట్టన్నవర్, మహేశ్ శెట్టి తిమరోడి, టి జయంత్, విట్టల గౌడ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం అక్టోబర్ 30 న స్టే విధించింది.
గతంలో ఈ సంఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఈ నలుగురు సమర్థించారు. తరువాత ఈ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరారు. కేసును విచారించిన జస్టిస్ మహ్మద్ నవాజ్ స్టే ను ఎత్తి వేస్తూ, సామాజిక కార్యకర్తలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూసుకోవాలని సిట్ ను ఆదేశించారు.
భారతీయ నాగరిక సురక్షా సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 35(3) కింద సిట్ గతంలో కార్యకర్తలైన మహేశ్ శెట్టి, తిమరోడి, మట్టన్నవర్, విట్టల గౌడ, జయంత్ లను నోటీసులు జారీ చేసింది. మట్టన్నవర్ తరఫున సీనియర్ న్యాయవాదీ ఎస్. బాలన్ హైకోర్టులో వాదనలు వినిపించారు.
తన క్లయింట్ దర్యాప్తును వ్యతిరేకించలేదని, అయితే కేసులో ఆరోపణలు చేస్తున్న అందరికి రక్షణ కల్పించాలని కోరారని అన్నారు. కేసును కొట్టి వేయాలన్నా అభ్యర్థనలను సిట్ వ్యతిరేకించింది.
దర్యాప్తుకు అవసరమైన కీలక ఆధారాలు లభించాయని తెలిపింది. సిట్ పరిమితి విస్తరించామని కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.