SLBC టన్నెల్లో 9 రోజులుగా 703 మంది రెస్క్యూ నిపుణుల సహాయక చర్యలు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో గడచిన 9 రోజులుగా 18 కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలకు చెందిన 703 మంది నిపుణులు సహాయక చర్యలు చేపట్టారు.;

Update: 2025-03-02 00:59 GMT

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికుల ప్రాణాలు కోల్పోయారు. టన్నెల్ కూలిన ఘటనలో బురద, నీరు,టన్నెల్ బోరింగ్ మెషీన్ల కింద 8మంది సజీవ సమాధి అయ్యారు.

9 రోజులుగా నిరంతరం కొనసాగుతున్న సహాయక చర్యలు
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో 9 రోజులుగా సాగుతున్న సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 703 మంది రెస్క్యూ నిపుణులు పాల్గొంటున్నారు. అధునాతన సాంకేతికతను వినియోగించినా, టన్నెల్ లోపల బురద, నీటితో సహాయ చర్యల్తో తీవ్ర జాప్యం జరిగింది. తెలంగాణ డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్,జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టన్నెల్ వద్ద మకాం వేసి సహాయ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించారు.

కొనసాగుతున్న సహాయ చర్యలు
ఎస్ఎల్బీసీలో గ‌ల్లంతైన 8 మంది జాడ కోసం బురద, శిథిలాలు, నీటిని తొలగిస్తూ యత్నిస్తున్నామని తెలంగాణ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు చెప్పారు. రెస్క్యూ టీమ్స్ తో పాటు యంత్రాల సహాయంతో స‌మాంత‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.ఎల్ఎల్బీసీ సొరంగంలో శిథిలాల తొల‌గింపు, డీ వాట‌రింగ్ ప‌నులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయ‌ని, మంత్రి జూప‌ల్లి పేర్కొన్నారు.

టీబీఎం కింద నలుగురి ఆనవాళ్లు లభించాయి...
టన్నెల్ లోపల మొత్తం 8 మంది గ‌ల్లంతు కాగా జీపీఆర్ ద్వారా ఇప్ప‌టికే ఆ న‌లుగురి జాడ క‌నుగొన్నారు. ఆ ప్రాంతంలో త‌వ్వ‌కాలు కొన‌సాగుతున్నాయ‌ని, ఆదివారం సాయంత్రంలోగా టన్నెల్ లో స‌హాయక చ‌ర్య‌లు పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌ని మంత్రి జూపల్లి ప్రకటించారు. ట‌న్నెల్ బోరింగ్ మిష‌న్ కింద మ‌రో న‌లుగురి ఆన‌వాళ్లు క‌న్పించిన‌ట్లు తెలుస్తోంద‌ని మంత్రి చెప్పారు.

నల్లొండకు నీరందించేందుకే ఎస్ఎల్‌బీసీ
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ప్రాజెక్ట్ (SLBC) తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ ప్రాజెక్టును పూర్వ నల్గొండ జిల్లాకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించారు.ఈ ప్రాజెక్టును నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించడానికి ప్రారంభించారు.ప్రధానంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ ను ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీటిగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జలయజ్ఞంలో ఎస్ఎల్‌బీసీ పనులు ప్రారంభం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004వ సంవత్సరంలో ప్రారంభమైన నీటిపారుదల ప్రాజెక్టు జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్‌బీసీ ఉనికిలోకి వచ్చింది. మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ. 1,925 కోట్ల అంచనా వ్యయంతో 2007లో పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులో 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మాణం చాలా కీలకం. జేపీ కన్స్ట్రక్షన్ కంపెనీ చుట్టుపక్కల పర్యావరణానికి హాని కలిగించకుండా టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM)తో పనులు చేపట్టింది. దోమల పెంట ఎస్ఎల్‌బీసీ ఇన్లెట్ ఒకటి.మన్నె వారి పల్లి అవుట్ లెట్ వద్ద మరొకటి, రెండు చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, రెండు లింక్ కాలువలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఇతర పనులు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.

43 కిలోమీటర్ల టన్నెల్...
శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీటిని తీసుకోవడానికి నల్గొండ జిల్లాలో 44 కిలోమీటర్లు (43.930 కి.మీ) సొరంగం తవ్వాల్సి వచ్చింది.జూన్ 2026 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్‌బీసీప్రాజెక్ట్ ద్వారా నల్గొండకు నీటిని అందించడానికి చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 22వ తేదీన పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. దీనిలో 8 మంది కార్మికులు ఒక సొరంగంలో చిక్కుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని సజీవంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సహాయక చర్యలను సమన్వయం చేయగా, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏజెన్సీలతో సమీక్షలు నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేశారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి...
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC)సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆక్వా-ఐ, ప్రోబోస్కోప్, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు.18 సంస్థలు, 54 మంది అధికారులు, 703 మంది రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్, GIS, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ర్యాట్ మైనర్స్, హైడ్రా, ఆర్మీ, నేవీ, NTRF, ర్యాట్ హోల్ మైనర్స్, ఆర్మీ ఇంజనీర్లు, ఆర్మీ మెడికల్ ఆఫీసర్లు, మిలిటరీ సర్వీస్ ఇంజనీర్లు, KK బిల్డర్స్ ఢిల్లీ, L&T, DRF, నవయుగ, మెగా, రాబిన్సన్ సంస్థలు,అధికారులు రెస్క్యూ ఆపరేషన్లను సమీక్షించి, శిథిలాలు, బురదను తొలగించే పనిని రెస్క్యూ బృందాలతో వేగవంతం చేశారు.

రెస్క్యూ ఆపరేషన్లు
నిపుణుల పర్యవేక్షణలో, సొరంగం నుంచి మట్టి, బురద, కాంక్రీట్ శిధిలాలను తొలగించడానికి, గ్యాస్ కట్టర్లతో విరిగిన పరికరాలను కత్తిరించడానికి పని జరుగుతోందని అరవింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రెస్క్యూ బృందాలతో మూడు షిఫ్టులలో రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి మరియు డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. రెస్క్యూ ఆపరేషన్ త్వరలో పూర్తవుతుందని భావిస్తున్నారు. సొరంగంలోని స్ప్రింగ్ వాటర్‌ను తొలగించడానికి డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సిల్ట్‌ను తొలగించడానికి సొరంగం లోపల ఒక ఎక్స్‌కవేటర్ యంత్రం పనిచేస్తోంది.

సింగరేణి సహాయ చర్యలు
200 మందితో కూడిన సింగరేణి గనుల రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటుంది. దాదాపు వంద మంది సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఇప్పటికే సొరంగం వద్ద పనిచేస్తున్నారు. వారితో పాటు, భూగర్భ సొరంగాల్లో రెస్క్యూ ప్రమాదాలలో నిపుణులైన బాగా శిక్షణ పొందిన సిబ్బందిని తీసుకువస్తున్నట్లు వారు తెలిపారు.నిపుణులు ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరం ద్వారా గుర్తించబడిన ఉపరితల అవాంతర చిత్రాలను విశ్లేషిస్తున్నారని అధికారులు తెలిపారు. సొరంగం ప్రమాద ప్రాంతం నుంచి శిథిలాలు ,బురదను తరలించడానికి కన్వేయర్ బెల్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM)
అల్ట్రా థర్మిక్ కటింగ్ మెషిన్ యొక్క రెండవ యూనిట్‌ను దక్షిణ మధ్య రైల్వే నుంచి తీసువచ్చారు.మూడు షిఫ్టులలో నిరంతరాయంగా సిల్ట్ తొలగింపు జరుగుతుంది, ప్రతి షిఫ్ట్‌కు 120 మంది పనిచేస్తున్నారు. ఆర్మీకి చెందిన రెండు బాబ్‌క్యాట్ యూనిట్లు కూడా పనిలో ఉన్నాయి. శనివారం ఉదయం షిఫ్ట్‌లో కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం సొరంగంలోకి వెళ్లింది.


Tags:    

Similar News