ఎంపీ మల్లు రవిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు..
కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ.;
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవిపై సొంత పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆయనపైనే పార్టీ హైకమాండ్కు కంప్లెయింట్లు ఇచ్చారు. ఈ మేరకు అలంపూర్ కాంగ్రెస్ నేతలు తమ ఫిర్యాదును అందించారు. కమీషన్లు తీసుకుని బీఆర్ఎస్ నేతల ఫైనాన్స్ బిల్లులను ఆయన క్రియర్ చేయిస్తున్నారని వారు ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ నేతల బిల్లులు క్లియర్ కాకుండా బీఆర్ఎస్ నేతల బిల్లులు క్లియర్ కావడం పట్ల కాంగ్రెస్ నేతల అసంతృప్తి. కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ని మల్లు రవి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదు. మల్లు రవి చర్యల వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఫిర్యాదు చేసిన అలంపూర్ కాంగ్రెస్ నేతలు. మల్లు రవి పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకోవడాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు. బీఆర్ఎస్ నేతలతో మల్లురవి తేనేటీ విందులు చేసుకోవడంపై కార్యకర్తల ఆగ్రహం. పదేండ్లు కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తి’’ వ్యక్తం చేస్తున్నారు.