పులుల గర్జనతో మార్మోగిన అమ్రాబాద్ అడవి
అమ్రాబాద్ అభయారణ్యంలో పర్యటనకు వెళ్లిన డీఎఫ్ఓ గోపిడి రోహిత్ బృందానికి పులి కనిపించింది.
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో (Amrabad Tiger Reserve) మూడు నెలల మేటింగ్ సీజన్ విరామం అనంతరం పులులు కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం అటవీశాఖ జీపులో అమ్రాబాద్ అభయారణ్యంలో పర్యటనకు వెళ్లిన డీఎఫ్ఓ గోపిడి రోహిత్ (rohithgopidi)బృందానికి పులి కనిపించింది(Tiger sighting). అభయారణ్యంలో పులి దర్శనమివ్వడంతో అటవీశాఖ బృందం సంభ్రమాశ్యర్యాలకు గురైంది. తమ అభయారణ్యంలో పులులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ మంగళవారం ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి చెప్పారు. అటవీశాఖ బృందం చూసిన పులి వీడియోను తీసి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అడవిలో పరిశీలనకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు పులి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సఫారీ యాత్ర బృందానికి కనిపించిన పులి
అడవిలో పులుల గర్జన
సఫారీ యాత్రకు రండి
పులుల గర్జనతో మార్మోగుతున్న ఈ అడవి ఇప్పుడు వన్యప్రాణి ప్రేమికులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.సఫారీ సీజన్ ప్రారంభ దశలోనే పులులు ప్రత్యక్షమవుతుండటంతో సఫారీ యాత్రలకు స్పందన పెరుగుతోంది. ప్రకృతిని సజీవంగా చూడాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ అడవిని తప్పక సందర్శించాలని అటవీశాఖ సూచిస్తోంది.