వెస్ట్ బెంగాల్‌లో S.I.R : బీజేపీ నేతల మాట నిజం కాదా?

కాషాయ పార్టీ నేతలకు ప్రధాని మోదీ సూచనేంటి?

Update: 2025-12-10 10:59 GMT
Click the Play button to listen to article

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (S.I.R)లో B.L.Oలు 56.37 లక్షలమంది ఓటర్లను ‘అన్‌ట్రేసబుల్’ గా గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు దాదాపు 7.66 కోట్లు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటరు జాబితాలో చనిపోయిన ఓటర్ల దాదాపు 23.98 లక్షల మంది ఉన్నారు. 19.65 లక్షల మంది అడ్రస్సులు మారాయి. 1.32 లక్షలు నకిలీ ఎంట్రీలు. మరో 10.95 లక్షల మంది ఓటర్ల జాడ తెలియరాలేదు. వీటిని ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చడం కుదరదు.

అయితే S.I.R ప్రక్రియ చేపడితే కోటి కంటే ఎక్కువ మంది ఓటర్ల పేర్ల తొలగింపు ఖాయమని బీజేపీ(B.J.P) నాయకులు గతంలో బహిరంగ ప్రకటనలు చేశారు. నకిలీ ఓటర్లలో ఎక్కువ శాతం అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు, రోహింగ్యాలు ఉంటారని వారు పేర్కొన్నారు.

"బెంగాల్‌లో కనీసం కోటి మంది బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యా ఓటర్లు ఉన్నారు. వారు మన వనరులను హరించి వేస్తున్నారు. వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి" అని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఇటీవల పేర్కొన్నారు. S.I.R ప్రక్రియ ద్వారా దాదాపు 1.2 కోట్ల మంది "అక్రమ ఓటర్లను" తొలగించవచ్చని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శంతను ఠాకూర్ పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య, అంతకుముందు అధ్యక్షుడు సుకాంత మజుందార్ లాంటి బీజేపీ నాయకులు కూడా వేర్వేరు వేదికలలో ఇలాంటి ప్రకటనలే చేశారు. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న గణాంకాలు వేరుగా ఉన్నాయి.

ఇంటింటి తనిఖీకి వెళ్లిన సమయంలో ఓటరు గుర్తింపు ధృవీకరించకలేకపోవడంతో సందేహాస్పద ఎంట్రీలుగా నమోదవుతున్నాయి.

ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్ లాంటి జిల్లాల్లో "సేకరించలేని" దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉందని ప్రాథమికంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. అన్ని జిల్లాల కంటే కోల్‌కతాలో అత్యధిక సంఖ్యలో "సేకరించలేని" ఫారమ్‌లు నమోదయ్యాయని కొన్ని వర్గాలు తెలిపాయి. కోల్‌కతాలో అటువంటి ఓటర్లు అత్యధికంగా జోరాసాంకోలో ఉన్నారు. ఆ తరువాత చౌరింఘీ ఉంది. రెండు నియోజకవర్గాల్లోనూ హిందీ మాట్లాడే ఓటర్లు గణనీయంగా ఉన్నారు.


బీజేపీ నాయకులకు మోదీ  సూచన..

సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం దాదాపు 1.25 కోట్ల ఓటర్ల జాబితా ఎంట్రీలను పరిశీలించాలని కమిషన్‌కు ఒక మెమోరాండం సమర్పించింది. తక్కువ వ్యవధిలో అసాధారణ సంఖ్యలో ఎంట్రీలు జరిగాయని వారు ఆరోపించారు. ఈ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఆరోపించారు. ఇదిలా ఉండగా ఎస్ఐఆర్ వ్యాయామాన్ని మతతత్వంగా చూపించవద్దని ఇటీవల బెంగాల్ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ చెప్పారని పార్టీ రాణాఘాట్ ఎంపీ జగన్నాథ్ సర్కార్ విలేఖరులతో అన్నారు.

తుది జాబితా ప్రచురితమయ్యే వరకు అన్ని దశలలో పర్యవేక్షణ ప్రక్రియను బలోపేతం చేయడానికి డిసెంబర్ 8న పోల్ ప్యానెల్ జాయింట్ సెక్రటరీ హోదా ఉన్న ఐదుగురు IAS అధికారులను స్పెషల్ రోల్ అబ్జర్వర్లుగా నియమించింది. 

Tags:    

Similar News