27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ఖరారు..

తెలంగాణలో పలు జిల్లాల పార్టీ అధ్యక్షుల విషయంలో బీజేపీ తుది నిర్ణయం తీసుకుంది. జిల్లా పార్టీ పగ్గాలను ఎవరి చేతుల్లో పెట్టాలన్న విషయంపై ఒక క్లారిటీకి వచ్చింది.;

Update: 2025-02-03 08:07 GMT

తెలంగాణలో పలు జిల్లాల పార్టీ అధ్యక్షుల విషయంలో బీజేపీ తుది నిర్ణయం తీసుకుంది. కార్యకర్తలు, నేతల అభిప్రాయ సేకరణ తర్వాత జిల్లా పార్టీ పగ్గాలను ఎవరి చేతుల్లో పెట్టాలన్న విషయంపై ఒక క్లారిటీకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో 27 జిల్లాలకు తమ పార్టీ అధ్యక్షులకు ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. వీటిలో బీసీలకు 15 చోట్ల అవకాశం కల్పించింది బీజేపీ. ఓసీలకు 10 చోట్ల, రెడ్లకు 7చోట్ల, ఆర్యవైశ్యులకు 2 చోట్ల, కమ్మవారికి ఒక చోట అవకాశం కల్పించింది. ఎస్సీలను రెండు చోట్ల అధ్యక్షులుగా నియమించింది. 27 జిల్లాల్లో ఒకే ఒక చోట మహిళకు అవకాశం లభించింది.

బీజేపీ జిల్లా అధ్యక్షులు వీరే

  • హైదరాబాద్ సెంట్రల్ జిల్లా - లంకల దీపక్ రెడ్డి..
  • భువనగిరి - అశోక్ గౌడ్
  • జనగామ - చౌడా రమేష్..
  • నల్గొండ - వర్షిత్ రెడ్డి..
  • మేడ్చల్ - బి.శ్రీనివాస్..
  • సిద్దిపేట - మోహన్ రెడ్డి..
  • గోల్కొండ - ఉమామహేందర్
  • హన్మకొండ - సతీష్ రెడ్డి
  • భాగ్యనగర్ - శేఖర్ చంద్ర..
  • సికింద్రాబాద్ - భారత్ గౌడ్
  • నిజామాబాద్ - దినేష్..
  • జగిత్యాల - యాదగిరి
  • వరంగల్ - గంట రవి..
  • మహబూబ్ నగర్ - శ్రీనివాస్
  • వనపర్తి - నారాయణ
  • భోపాలపల్లి - నిషిదర్ రెడ్డి..
  • ఖమ్మం - రవి కుమార్..
  • మహబూబ్ బాద్ - వెంకటేశ్వర్లు
  • ములుగు - బలరాం..
  • మెదక్ - మహేష్ గౌడ్..
  • కామారెడ్డి - రాజు..
  • సంగారెడ్డి -గోదావరి అంజిరెడ్డి
  • పెద్దపల్లి - సంజీవ రెడ్డి..
  • అసిఫాబాద్ - శ్రీశైలం
  • మంచిర్యాల - వెంకటేశ్వర్లు గౌడ్..
Tags:    

Similar News