309 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు

మరో 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం.;

Update: 2025-07-23 12:16 GMT

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో భారీ సంఖ్యలో పదోన్నతులను ప్రభుత్వం ప్రకటించింది. అన్ని కళాశాలల్లోని 33 స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్‌లలో విధులు నిర్వహిస్తున్న 309 మంది అసోసియేటెడ్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు జీఓలను జారీ చేసి ప్రభుత్వం. ఈ క్రమంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభించనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తోంది. మరో 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీల అభివృద్ధి, ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల ప్రశంసించింది. ఒక్క సీటుకు కూడా కోత పెట్టకుండా, ఒక్క రూపాయి జరిమానా విధించకుండా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు కొనసాగిస్తున్నట్టు ఎన్‌ఎంసీ వెల్ల‌డించింది.

Tags:    

Similar News