రేవంత్ సర్కార్ ఆహ్వానంపై స్పందించిన కేసీఆర్...

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం పంపిన ఆహ్వానంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు CM రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

Update: 2024-06-01 14:35 GMT

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పంపిన ఆహ్వానంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు CM రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలంటూ ఆయనకి ఆహ్వాన లేఖ పంపిన నేపథ్యంలో సుదీర్ఘ లేఖ రాశారు. ప్రజల పక్షాన బహిరంగ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. తాను దశాబ్ది వేడుకలకు హాజరవడం లేదనే విషయాన్ని లేఖ ద్వారా స్పష్టం చేశారు.

"తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితం, అమరుల త్యాగాల పర్యవసానం. కానీ, కాంగ్రెస్ దయాభిక్షగా మీరు చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తున్నాను. 1969 నుంచి ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్నమార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం. 1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నది ఆదిగా.. కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజకరమైన సందర్భమే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్ ఎస్, తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉంది" అని కేసీఆర్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. 

కేసీఆర్ లేఖ కోసం క్లిక్ చేయండి.

Tags:    

Similar News