కొండా దంపతులకు వ్యతిరేకంగా అసమ్మతి నేతల భేటీ

ఎమ్మెల్యే నాయిని క్యాంప్ ఆఫీస్ లో...;

Update: 2025-06-29 08:25 GMT


వరంగల్ లో కొండా మురళి దంపతులకు వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , డిసిసి అధ్యక్షుడు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే నాయిని క్యాంప్ ఆఫీస్ లో కీలక భేటి జరుగుతోంది. ఇప్పటికే కొండా దంపతులకు వ్యతిరేకంగా కొందరు క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవి దృష్టికి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో కొండా మురళిని మల్లు రవి పిలిపించుకుని మాట్లాడారు. గాంధీ భవన్ లో సమావేశమైన కొద్ది సేపటికే కొండా మురళి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో మల్లు రవి మరోసారి షోకాజ్ నోటీసులు జారి చేశారు. అయితే కొండా మురళి క్రమశిక్షణా కమిటీకి బహిరంగ లేఖ రాయం చర్చనీయాంశమైంది.

తెలంగాణ హన్మకొండ భద్రకాళీ దేవాలయంలో బోనాల వేడుకల సందర్బంగా మాంసం, మద్యం అనుమతినిస్తూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్ణయం తీసుకున్నారని నాయిని వర్గం అంటోంది. భద్రకాళీ అమ్మవారికి నైవేద్యంగా మాంసం, మద్యం ఎక్కదని నాయిని వర్గం అంటోంది. దీంతో కొండా దంపతులు వర్సెస్ హన్మకొండ కాంగ్రెస్ నేతల మధ్య విభేధాలు ముదిరిపోయాయి.ఇది కాస్తా అధిష్టానం దృష్టిలో పడింది. దీంతో భథ్రకాళీ అమ్మవారి బోనాలు వేడుకలు రద్దయ్యాయి.చిలికి చిలికి గాలివానగా మారి కొండా దంపతులకు వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు  నాయిని రాజేందర్ రెడ్డి, కడియం , రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Tags:    

Similar News