హైదరాబాద్లో ‘ఆపరేషన్ అభ్యాస్’ సక్సెస్..!
ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4:30 మధ్య హైదరాబాద్లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి.;
హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం మాక్ డ్రిల్స్ను విజయవంతం నిర్వహించింది. భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత హీటెక్కిన క్రమంలో భద్రతా సన్నద్ధత కోసం దేశవ్యాప్తంగా కేంద్రం ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని నిశ్చియించుకుంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. వాటి ప్రకారమే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4:30 మధ్య హైదరాబాద్లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. నాచారం, కంచన్బాఘ్, గోల్కొండ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్స్లో భాగంగాలు ప్రజలకు పలు అంశాలను సూచించారు. డ్రిల్స్లో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధి లోపల రెండు నిమిషాల వరకు సైరెన్స్ మోగాయి.
ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్లో సైరన్ అత్యంత కీలకమైంది. దీనిద్వారా గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. వాయుసేనతో హాట్లైన్, రేడియో కమ్యూనికేషన్ను వినియోగంలోకి తెచ్చేందుకు, కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించేందుకు ఉపయోగించారు.