సిట్ దెబ్బకు ప్రభాకర్ రావు ఉక్కిరి బిక్కిరి..?

ప్రభాకర్ రావు నుంచి సమాధానాలు రాబట్టేలా విచారణను, అడిగే ప్రశ్నలను అధికారులు డిజైన్ చేశారు.;

Update: 2025-06-11 10:24 GMT

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఏ1 ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ రెండో రోజు విచారణ చేస్తోంది. జూన్ 9న దాదాపు ఎనిమిది గంటల పాటు సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించారు. కానీ ఆశించిన స్థాయిలో సమాధానాలు రాలేదు. ప్రతి ప్రశ్నకు కూడా డొంకతిరుగుడుగా, దాటవేసే రీతిలో సమాధానాలు చెప్పారాయన. దీంతో ఆయన విచారణ స్టైల్‌ను సిట్ అధికారులు మార్చారు. ప్రభాకర్ రావు నుంచి సమాధానాలు రాబట్టేలా విచారణను, అడిగే ప్రశ్నలను డిజైన్ చేశారు. ఆ ప్రకారమే రెండో రోజు విచారణను స్టార్ట్ చేశారు. ఈరోజు జరుగుతున్న విచారణలో సిట్ అధికారుల ప్రశ్నలకు ప్రభాకర్ రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

తెస్తారా? తెచ్చుకోమంటారా?

తొలిరోజు విచారణ ముగుస్తున్న సమయంలో ప్రభాకర్ రావును సిట్ అధికారులు కొన్ని వస్తువులు అడిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వాడిని రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్ ట్యాప్, మ్యాక్ బుక్‌లను అధికారులకు అందించాలని ఆదేశించారు. ఒకవేళ అందుకు ఆయన నిరాకరిస్తే తామే వారి ఇంట్లో సోదాలు చేసి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అధికారుల ఆదేశాల ప్రకారం రెండో రోజు విచారణకు ప్రభాకర్ రావు.. అన్ని పరికరాలను తీసుకొచ్చారు. వాటిని అధికారులకు హ్యాండోవర్ చేశారు. కాగా ఇప్పుడు అధికారులు వాటిని పరిశీలించనున్నారు.

ఘాటు పెంచిన సిట్..

మొదటి రోజు విచారణలో ప్రభాకర్ రావు.. నోరు పెదపలేదు. దీంతో ఆయన నుంచి సమాధానాలు రాబట్టడం కోసం సిట్ అధికారులు కొత్త వ్యూహం పన్నారు. రెండో రోజు విచారణలో అడిగే ప్రశ్నల్లో ఘాటు పెంచారు. అసలు హార్డ్ డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు? ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్ట్‌ల ఫోన్లు ట్యాప్ చేయమని ఎవరు చెప్పారు? ఇందులో ప్రైవేటు వ్యక్తి అయిన శ్రవణ్ రావు పాత్ర ఎంత? అని ప్రశ్నించారు. దాంతో పాటుగానే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి టెలికాం నుంచి సేకరించిన సర్వీస్ డేటా, ఎఫ్ఎస్‌ఎల్ రిపోర్ట్, ఐదుగురు నిందితుల స్టేట్‌మెంట్‌లను కూడా ప్రభాకర్ రావు ముందుంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News