హైదరాబాద్ సీపీగా సజ్జనార్..

23 మంది ఐపీఎస్‌ల బదిలీలు.

Update: 2025-09-27 03:30 GMT

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆర్టీసీలో ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ కమిషనర్‌గా బదిలీ చేసింది. సీపీ సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

మిగిలిన బదిలీలిలా..

  • విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్‌
  • ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు
  • ఎల్బీనగర్ డీసీపీగా బి. అనురాధ
  • ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సీహెచ్‌ ప్రవీణ్ కుమార్
  • స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు
  • ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి
  • ఇంటెలిజెన్స్‌ డీజీగా విజయ్‌ కుమార్‌
  • ఫౌరసరఫరాల ప్రిన్సిపల్‌ సెక్రటరీగా స్టీఫెన్‌ రవీంద్ర
  • గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డిజీగా అనిల్ కుమార్
  • రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్
  • వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్
  • మాదాపూర్ డీసీపీగా రితు రాజ్
  • సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా రవి గుప్తా
  • మల్టీజోన్ 2 ఐజీగా డీఎస్‌ చౌహన్
  • విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్
  • హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీగా శ్రీనివాసులు
  • హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా తఫ్సీర్ ఇక్బాల్
  • సిద్దిపేట కమిషనర్‌గా ఎస్.ఎమ్ విజయ్ కుమార్
  • ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ
  • నారాయణపేట ఎస్పీగా జి. వినీత్
Tags:    

Similar News